ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్ గఢ్‌లోభారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌ శనివారం రాత్రి ఆరు గంటల ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. బస్తర్‌ రేంజి పరిధిలోని కొండగాం(ధనోరా) జిల్లా తిమిడి పోలీసు స్టేషన్‌ పరిధిలోని జాంగ్లా అటవీప్రాంతంలో మావోయిస్టులు పేలుడు సామగ్రిని తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో […]

Advertisement
Update: 2015-06-06 13:08 GMT
ఛత్తీస్ గఢ్‌లోభారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌ శనివారం రాత్రి ఆరు గంటల ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. బస్తర్‌ రేంజి పరిధిలోని కొండగాం(ధనోరా) జిల్లా తిమిడి పోలీసు స్టేషన్‌ పరిధిలోని జాంగ్లా అటవీప్రాంతంలో మావోయిస్టులు పేలుడు సామగ్రిని తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో రెండుపక్షాల నడుమ దాదాపు గంట వరకు కాల్పులు జరగాయి. ఈ సంఘ‌ట‌న‌లో ఆరుగురు మావోలు చ‌నిపోయారు.
Tags:    
Advertisement

Similar News