త్యాగధనులను కేసీఆర్ పక్కనబెట్టారు: మందకృష్ణ
త్యాగాలు చేసిన వారిని కేసీఆర్ పక్కనపెట్టి ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలంగాణ కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మహిళా గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ..మహిళలకు జరిగిన అన్యాయాన్ని విపక్షాలు పట్టించుకోవడం లేదన్నారు. మహిళలకు న్యాయం జరిగే వరకూ తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కెసీఆర్ తన కేబినెట్లో ఒక్క మహిళను కూడా ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. తెలంగాణలో అంత […]
Advertisement
త్యాగాలు చేసిన వారిని కేసీఆర్ పక్కనపెట్టి ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలంగాణ కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మహిళా గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ..మహిళలకు జరిగిన అన్యాయాన్ని విపక్షాలు పట్టించుకోవడం లేదన్నారు. మహిళలకు న్యాయం జరిగే వరకూ తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కెసీఆర్ తన కేబినెట్లో ఒక్క మహిళను కూడా ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. తెలంగాణలో అంత సత్తా ఉన్న మహిళలు కేసీఆర్కు కనిపించలేదా అని ప్రశ్నించారు.
Advertisement