108 సిబ్బంది సమ్మె నోటీసు

హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం మే ఐదు నుంచి సమ్మె చేయాలని నిర్ణయించినట్లు 108 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వివరించారు. ఈ మేరకు కార్మిక శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్లను కలసి సమ్మె నోటీసులను అందజేశారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకూ జీతాలను పెంచాలని, ఉద్యోగాలను క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని వారు క‌ోరుతున్నారు. అలాగే వివిధ కారణాలు చూపి తొలగించిన 140 మంది ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఉద్యోగ […]

Advertisement
Update: 2015-04-21 02:52 GMT
హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం మే ఐదు నుంచి సమ్మె చేయాలని నిర్ణయించినట్లు 108 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వివరించారు. ఈ మేరకు కార్మిక శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్లను కలసి సమ్మె నోటీసులను అందజేశారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకూ జీతాలను పెంచాలని, ఉద్యోగాలను క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని వారు క‌ోరుతున్నారు. అలాగే వివిధ కారణాలు చూపి తొలగించిన 140 మంది ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండు చేస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News