Telugu Global
NEWS

‘యువతిని చెరబట్టిన సీఐ ఇంకా లొంగి పోలేదు’

భర్తను తుపాకీతో బెదిరించి భార్యపై అత్యాచారం చేసిన మారేడ్‌పల్లి పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు లొంగి పోయారనే వార్తలు నిజం కాదని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు. అతని కోసం ఇంకా గాలిస్తున్నామని ఆయన తెలిపారు. హస్తినాపురంలో నివాస ముండే ఓ యువతిపై కన్ను వేసిన సీఐ నాగేశ్వర్ రావు ఆమె భర్తపై అక్రమ కేసులు పెట్టి ఆయనను బ్లాక్ మెయిల్ చేసి తన ఫార్మ్ హౌజ్ లో పనికి పెట్టుకున్నాడు. భర్త పొలం దగ్గర […]

‘యువతిని చెరబట్టిన సీఐ ఇంకా లొంగి పోలేదు’
X

భర్తను తుపాకీతో బెదిరించి భార్యపై అత్యాచారం చేసిన మారేడ్‌పల్లి పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు లొంగి పోయారనే వార్తలు నిజం కాదని రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు. అతని కోసం ఇంకా గాలిస్తున్నామని ఆయన తెలిపారు.

హస్తినాపురంలో నివాస ముండే ఓ యువతిపై కన్ను వేసిన సీఐ నాగేశ్వర్ రావు ఆమె భర్తపై అక్రమ కేసులు పెట్టి ఆయనను బ్లాక్ మెయిల్ చేసి తన ఫార్మ్ హౌజ్ లో పనికి పెట్టుకున్నాడు. భర్త పొలం దగ్గర ఉండగా సీఐ నాగేశ్వర్ రావు ఆయువతి ఇంటికొచ్చి ఆమెపై అనేక సార్లు అత్యాచారం చేశాడు.

లొంగకపోతే బ్రోతల్ కేసులు పెడతానని ఆమెను లొంగదీసుకున్నాడు. మూడు రోజుల క్రితం నాగేశ్వర్ రావు ఆ యువతిని బలవంతం చేస్తుండగా ఆ యువతి భర్త ఇంటికివచ్చాడు. ఆ సమయంలో ఇద్దరికి ఘర్షణ జరిగింది, సీఐ యువతి భర్తను, యువతిని రివాల్వర్ తో బెదిరించి కారులో కిడ్నాప్ చేసి ఇబ్రాహింపట్నం వైపు తీసుకెళ్తుండగా కారుకు ఆక్సిడెంట్ అయ్యింది.

దాంతో అక్కడి నుంచి తప్పించుకున్న భార్యా భర్తలు వనస్థలీ పురం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాగేశ్వరరావుపై అత్యాచారం, కిడ్నాప్‌, హత్యాయత్నం, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.

ఆరోజు నుండి సీఐ నాగేశ్వర్ రావు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అయితే సీఐ లొంగిపోయాడని నిన్న మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. ఆ వార్తలను ఖండించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ సీఐ ఇంకా దొరకలేదని చెప్పారు.

First Published:  10 July 2022 9:43 PM GMT
Next Story