Telugu Global
MOVIE UPDATES

దర్జాగా 22న థియేటర్లలోకి

సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రంగస్థలం, క్షణం, పుష్ప సినిమాలతో పేరుతెచ్చుకుంది అనసూయ. అటు సునీల్ కూడా పుష్పతో పాటు పలు సినిమాలతో క్రేజ్ […]

దర్జాగా 22న థియేటర్లలోకి
X

సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

రంగస్థలం, క్షణం, పుష్ప సినిమాలతో పేరుతెచ్చుకుంది అనసూయ. అటు సునీల్ కూడా పుష్పతో పాటు పలు సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నాడు. వీళ్లిద్దరూ కలిసి నటించిన సినిమా కావడంతో దర్జాపై అంచనాలు పెరిగాయి. అయితే సినిమాలో వీళ్లు హీరోహీరోయిన్లు మాత్రం కాదు. కేవలం కీలక పాత్రలని మాత్రమే యూనిట్ చెబుతోంది. దీంతో మూవీలో వీళ్లు ఎంత సేపు కనిపిస్తారనేది అనుమానాస్పదం.

సునీల్, అనసూయతో పాటు సీనియర్ నటి ఆమని ఇందులో కీలక పాత్ర పోషించింది. పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, షకలక శంకర్, మిర్చి హేమంత్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు రాప్ రాక్ షకీల్ సంగీతం అందించాడు.

First Published:  10 July 2022 12:13 AM GMT
Next Story