వెబ్ సిరీస్ తో హీరోయిన్ రీఎంట్రీ
శేఖర్ కమ్ముల- రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. ఆ సినిమాలో తన అందం, యాక్టింగ్ టాలెంట్ తో అందర్నీ ఆకర్షించింది ప్రియా ఆనంద్. అయితే ఆ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ హిట్స్ పడలేదు. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, కో అంటే కోటి, 180 సినిమాలతో హీరోయిన్ గా చేసినప్పటికీ.. క్రేజ్ అంతంతమాత్రంగానే వచ్చింది. అలా కొన్నాళ్లకు ఈ ముద్దుగుమ్మ ఫేడవుట్ […]
శేఖర్ కమ్ముల- రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. ఆ సినిమాలో తన అందం, యాక్టింగ్ టాలెంట్ తో అందర్నీ ఆకర్షించింది ప్రియా ఆనంద్. అయితే ఆ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ హిట్స్ పడలేదు. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, కో అంటే కోటి, 180 సినిమాలతో హీరోయిన్ గా చేసినప్పటికీ.. క్రేజ్ అంతంతమాత్రంగానే వచ్చింది. అలా కొన్నాళ్లకు ఈ ముద్దుగుమ్మ ఫేడవుట్ అయింది. తమిళనాట కొన్ని సినిమాలు చేసి, కోలీవుడ్ కే పరిమితమైంది.
మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో అడుగుపెట్టింది ప్రియా ఆనంద్. కాకపోతే ఈసారి సినిమాతో పాటు. ఓ వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇస్తోంది. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ చేసిన ఆ వెబ్ సిరీస్ పేరు మా నీళ్ల ట్యాంక్. దీన్ని షార్ట్ కట్ లో ఎంఎన్టీ అని పిలుస్తున్నారు.
వరుడు కావలెను సినిమాతో మంచి హిట్ సాధించిన లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో 'మా నీళ్ల ట్యాంక్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఒక చిన్న గ్రామంలో పనికిరాని వాటర్ ట్యాంక్ చుట్టూ నడిచే కథతో, సరదా సరదా సన్నివేశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. జీ5 సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్ సబ్ ఇన్ స్పెక్టర్గా నటిస్తుండగా, పల్లెటూరు అమ్మాయిగా ప్రియా ఆనంద్ కనిపిస్తోంది.
మొత్తం 8 ఎపిసోడ్స్గా రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సీరిస్ జులై 15 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియా సొంతంగా డబ్బింగ్ చెప్పింది. ఈ వెబ్ సిరీస్ తో తెలుగులో మళ్లీ బిజీ అవుతానంటోంది ఈ భామ.