Telugu Global
MOVIE UPDATES

శృతిహాసన్ కు ఏమైంది.. ఆమె ఆరోగ్యంగానే ఉందా?

నిన్నంతా శృతిహాసన్ పై ఓ రేంజ్ లో పుకార్లు షికార్లు చేశాయి. ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతోందంటూ ఓ సెక్షన్ మీడియా కథనాలు ప్రచురించింది. మరికొన్ని మీడియా సంస్థలైతే, బాలయ్యకు కరోనా సోకడంతో శృతిహాసన్ కు కూడా కరోనా వచ్చిందంటూ వార్తలు రాసేశాయి. వీటన్నింటిపై శృతిహాసన్ స్పందించింది. “నేను నా ఆరోగ్య పరిస్థితిపై స్పందించాను. నాకున్న సమస్యను బయటపెట్టాను. అంటే దానర్థం, నేను అనారోగ్యంతో ఉన్నానని, లేదా అత్యవసర స్థితిలో […]

శృతిహాసన్ కు ఏమైంది.. ఆమె ఆరోగ్యంగానే ఉందా?
X

నిన్నంతా శృతిహాసన్ పై ఓ రేంజ్ లో పుకార్లు షికార్లు చేశాయి. ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతోందంటూ ఓ సెక్షన్ మీడియా కథనాలు ప్రచురించింది. మరికొన్ని మీడియా సంస్థలైతే, బాలయ్యకు కరోనా సోకడంతో శృతిహాసన్ కు కూడా కరోనా వచ్చిందంటూ వార్తలు రాసేశాయి. వీటన్నింటిపై శృతిహాసన్ స్పందించింది.

“నేను నా ఆరోగ్య పరిస్థితిపై స్పందించాను. నాకున్న సమస్యను బయటపెట్టాను. అంటే దానర్థం, నేను అనారోగ్యంతో ఉన్నానని, లేదా అత్యవసర స్థితిలో ఉన్నానని కాదు. మరికొన్ని మీడియా సంస్థలు అసలు నా పోస్ట్ చదవకుండానే ఊదరగొట్టాయని నాకు అర్థమైంది. నేను కచ్చితంగా చెబుతున్నాను. నేను కొన్నాళ్లుగా పీసీఓఎస్‌తో బాధపడుతున్నాను. అంటే దానర్థం నేను మంచాన పడ్డానని మాత్రం కాదు.”

ఇలా తన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది శృతిహాసన్. ప్రస్తుతం తను నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నానని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటూ ఓ వీడియో విడుదల చేసింది. ఇకనైనా తన హెల్త్ కండిషన్ పై పుకార్లు ఆపాలని ఆమె కోరింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ, ప్రభాస్ సరసన సలార్ అనే సినిమాలో నటిస్తోంది. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్. త్వరలోనే మరో పెద్ద సినిమాలో ఆమె నటించనుంది. ఆ డీటెయిల్స్ త్వరలోనే బయటకొస్తాయి.

First Published:  5 July 2022 10:14 PM GMT
Next Story