Telugu Global
National

మా తిరుగుబాటు వెనక ఉన్నది బీజేపీనే… వెల్లడించిన మహా రాష్ట్ర సీఎం షిండే

మహారాష్ట్ర లో శివసేన పార్టీలో రేగిన తిరుగుబాటుకు కర్త, కర్మ, క్రియ మొత్తం బీజేపీనే అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అది నిజ‌మే అని బహిర్గతపరిచారు తిరుగుబాటు నాయకుడు , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే. మా ఎమ్మెల్యేలంతా నిద్రపోయే సమయంలో నేనూ, బీజేపీ నేత ఫడ్నవీస్ కలుసుకునేవాళ్ళం ఎమ్మెల్యేలు నిద్ర లేచే సమయానికి మళ్ళీ నేను హోటల్ కు వచ్చేసే వాడిని అని షిండే చెప్పారు. పక్కనున్న ఫడ్నవీస్ ను చూపిస్తూ ఇతను పెద్ద […]

మా తిరుగుబాటు వెనక ఉన్నది బీజేపీనే… వెల్లడించిన మహా రాష్ట్ర సీఎం షిండే
X

మహారాష్ట్ర లో శివసేన పార్టీలో రేగిన తిరుగుబాటుకు కర్త, కర్మ, క్రియ మొత్తం బీజేపీనే అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అది నిజ‌మే అని బహిర్గతపరిచారు తిరుగుబాటు నాయకుడు , మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే.

మా ఎమ్మెల్యేలంతా నిద్రపోయే సమయంలో నేనూ, బీజేపీ నేత ఫడ్నవీస్ కలుసుకునేవాళ్ళం ఎమ్మెల్యేలు నిద్ర లేచే సమయానికి మళ్ళీ నేను హోటల్ కు వచ్చేసే వాడిని అని షిండే చెప్పారు. పక్కనున్న ఫడ్నవీస్ ను చూపిస్తూ ఇతను పెద్ద కళాకారుడు మొత్తం నడిపించింది ఇతనే అని షిండే అన్నారు. ఫడ్నవీస్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదని షిండే అన్నారు.

బీజేపీ కంటే మా సంఖ్య తక్కువగా ఉంది కానీ ప్రధాని నరేంద్ర మోదీ మమ్మల్ని ఆశీర్వదించారు. మోదీ సాహెబ్ ప్రమాణ స్వీకారానికి ముందు నాకు అన్ని విధాలా సాయం చేస్తానని చెప్పారు. అమిత్ షా సాహెబ్ మా వెనుక బండరాయిలా నిలుబడ్డారు అని షిండే అన్నారు.

శివసేన తిరుగుబాటుతో తమకేం సంబంధం లేదని ఫడ్నవీస్, ఇతర బీజేపీ నేతలు అనేక సార్లు మాట్లాడిన నేపథ్యంలో అదంతా అబద్దమని, ఈ తిరుగుబాటును వెనక ఉండి నడిపించింది బీజేయే అని స్వయంగా ఏక్ నాథ్ షిండే బహిర్గతపర్చడంతో ఏం జావాబు చెప్పుకోవాలో బీజేపీ నాయకులకు అర్దం కావడం లేదు.

First Published:  4 July 2022 9:46 PM GMT
Next Story