Telugu Global
NEWS

హైదరాబాద్‌లో ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్ ఇలా.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ అంగరంగ వైభవంగా ముస్తాబయ్యింది. మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో శని, ఆదివారాల్లో (జూలై 2, 3న) జరుగనున్న ఈ సమావేశానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులతో సహా పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రధాని సహా కేంద్ర ప్రభుత్వంలోని కీలక నాయకులంతా హైదరాబాద్‌కు రానుండటంతో ఎస్పీజీతో పాటు తెలంగాణ పోలీస్ భారీ భద్రత ఏర్పాట్లు […]

హైదరాబాద్‌లో ప్రధాని మోడీ టూర్ షెడ్యూల్ ఇలా.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే
X

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ అంగరంగ వైభవంగా ముస్తాబయ్యింది. మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో శని, ఆదివారాల్లో (జూలై 2, 3న) జరుగనున్న ఈ సమావేశానికి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులతో సహా పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రధాని సహా కేంద్ర ప్రభుత్వంలోని కీలక నాయకులంతా హైదరాబాద్‌కు రానుండటంతో ఎస్పీజీతో పాటు తెలంగాణ పోలీస్ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది.

మోడీ టూర్ షెడ్యూల్ ఇలా..

– ప్రధాని మోడీ శనివారం మధ్యాహ్నం 12.45కు ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరతారు.

– మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

– మధ్యాహ్నం 3.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్‌లో నోవోటెల్ హోటల్‌కు చేరుకుంటారు.

– 3.30 నుంచి 4.00 వరకు హోటల్‌లో ఉంటారు.

– సాయంత్రం 4.00 గంట నుంచి రాత్రి 9.00 గంటల వరకు హెచ్ఐసీసీ‌లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు.

– రాత్రి 9.00 గంటల తర్వాత సమయాన్ని రిజర్వ్‌గా ప్రకటించారు. రాత్రికి నోవోటెల్‌లోనే బస చేస్తారు.

– ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు.

– సాయంత్రం 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్ టైంగా ఉంచారు.

– సాయంత్రం 5.55 గంటలకు హెలీకాప్టర్‌లో బేగంబేటకు బయలుదేరుతారు.

– 6.15కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

– బేగంపేట నుంచి పరేడ్ గ్రౌండ్స్‌కు రోడ్డు మార్గంలో వెళ్తారు.

– సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.

– రాత్రి 7.35కు పరేడ్ గ్రౌండ్స్ నుంచి రాజ్‌భవన్ లేదా నోవోటెల్‌కు వెళ్లి.. రాత్రి బస చేస్తారు.

– సోమవారం ఉదయం 9.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

– ఉదయం 10.10 గంటలకు విజయవాడ చేరుకుంటారు.

ట్రాఫిక్ ఆంక్షలు..

ప్రధాని మోడీ రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటున్నారు. దీంతో మాదాపూర్, హెచ్ఐసీసీ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

– నీరూస్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి వెళ్లే వాహనాలు.. సీఓడీ నుంచి దుర్గం చెరువు, బయోడైవర్సిటీ మీదుగా రాకపోకలు సాగించాలి.

– ఆర్సీపురం, చందానగర్, మాధాపూర్, గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు.. బీహెచ్ఈఎల్, హెచ్‌సీయూ, ట్రిపుల్ ఐటీ మీదుగా వెళ్లాలి.

– మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి వచ్చే వాహనాలు ఏఐజీ హాస్పిటల్, దుర్గం చెరువు మీదుగా రాకపోకలు సాగించాలని పోలీసులు తెలిపారు.

First Published:  1 July 2022 6:59 AM GMT
Next Story