Telugu Global
NEWS

కొడాలిని ఓడిస్తానంటూ సవాలా? : పేర్ని నాని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని ఆరోపించారు. ‘జగన్‌ను దించేస్తా.. నేను సీఎం అవుతా అంటూ చంద్రబాబు సవాళ్లు విసిరాడు. కానీ ఇప్పుడు దిగజారిపోయి .. గుడివాడలో కొడాలిని ఓడిస్తాననే స్థాయికి దిగజారాడు. ముందుకు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పరిస్థితి చూసుకోవాలి. ఇప్పటికే అక్కడ పునాదులు కదిలాయి. అది మరిచిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇక కొడాలి నాని పరిస్థితి గతంలోలా ఇప్పుడు లేదు. […]

కొడాలిని ఓడిస్తానంటూ సవాలా? : పేర్ని నాని
X

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని ఆరోపించారు. ‘జగన్‌ను దించేస్తా.. నేను సీఎం అవుతా అంటూ చంద్రబాబు సవాళ్లు విసిరాడు. కానీ ఇప్పుడు దిగజారిపోయి .. గుడివాడలో కొడాలిని ఓడిస్తాననే స్థాయికి దిగజారాడు. ముందుకు ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పరిస్థితి చూసుకోవాలి. ఇప్పటికే అక్కడ పునాదులు కదిలాయి. అది మరిచిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.

ఇక కొడాలి నాని పరిస్థితి గతంలోలా ఇప్పుడు లేదు. గుడివాడలో నాని ఎంతో పవర్ ఫుల్. ఆయనకు అక్కడ ఎంతో ఫాలోయింగ్ ఉంది. టీడీపీకి ఇక్కడ కనీసం అభ్యర్థి కూడా లేడు. ఇక నారా లోకేశ్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కట్టించిన ఇళ్లను బాత్రూంలతో పోల్చడం సరికాదు.’ అని పేర్ని నాని మండిపడ్డారు.

మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడివాడలో వైసీపీ బలంగా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేసి .. మీడియాను అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. కానీ ప్రజలు చంద్రబాబును, పచ్చమీడియాను నమ్మే పరిస్థితిలో లేరని వాపోయారు.

అనంతరం మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇంకో 25 ఏళ్ల పాటు ఆ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. వైసీపీని ఏమీ చేయలేరని పేర్కొన్నారు.

First Published:  28 Jun 2022 8:47 AM GMT
Next Story