Telugu Global
National

‘అగ్నిపథ్’ నిరసనల్లో హింసపై ‘సిట్’ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్

కేంద్ర ప్రభుత్వ ‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా యువత రగిలిపోతున్న నేపథ్యంలో శనివారం సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలైంది. నిరసనల్లో జరిగిన హింసపై విచారణకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్ సుప్రీం కోర్టును కోరింది. ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసాకాండపై దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పాటు, ఈ పథకంపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు […]

supreme court, protests
X

కేంద్ర ప్రభుత్వ ‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా యువత రగిలిపోతున్న నేపథ్యంలో శనివారం సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ దాఖలైంది. నిరసనల్లో జరిగిన హింసపై విచారణకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్ సుప్రీం కోర్టును కోరింది.

‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసాకాండపై దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పాటు, ఈ పథకంపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆ న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు.

జరిగిన హింసాకాండపై స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించినందుకు దోషుల నుండి క్లెయిమ్‌ను రికవరీ చేయడానికి క్లెయిమ్‌ల కమిషనర్‌ను నియమించేవిధంగా రాష్ట్రాలను ఆదేశించాలని న్యాయ‌వాది విశాల్ తివారీ కోర్టును కోరారు.అంతే కాకుండా, జాతీయ భద్రత, సైన్యంపై అగ్నిపథ్ పథకం ప్రభావాన్ని కూడా నిపుణుల కమిటీ అంచనా వేయాలని ఆయన కోరారు..

దేశ‌ త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. పలు రైళ్లను తగులబెట్టారు.

మరోవైపు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను విచారించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. రైల్వేతో పాటు ప్రజా ఆస్తులకు జరిగిన నష్టాలను విచారించాలని పిటిషన్ లో పిటిషనర్ కోరారు. ఈ పథకం వల్ల జాతీయ భద్రత, సైన్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశీలించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా కోరారు.

First Published:  18 Jun 2022 7:37 AM GMT
Next Story