Telugu Global
NEWS

‘ప‌రువు’ కు మ‌రో యువ‌కుడు బ‌లి.. కిడ్నాప్ చేసి మ‌రీ హ‌త్య‌..

నేటి స‌మాజంలో వేషానికే నాగ‌రిక‌త త‌ప్ప భావాల్లో ఇంకా అనాగ‌రిక ఆలోచ‌న‌లే క‌న‌బ‌డుతున్నాయి. పైకి ఆథునికుల‌మ‌ని చెప్పుకునే కుటుంబాల్లో కూడా ఇంకా ప‌రువు ప‌ట్టుకుని వేలాడుతూ అమాయ‌కులైన ప్రేమికుల ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో ఈ ప‌రువు హ‌త్య‌లు ఎక్కువ‌వుతూ మాన‌వ‌త్వాన్ని ప్ర‌శ్నార్ధ‌కం చేస్తున్నాయి. తాజాగా స‌త్య‌సాయి జిల్లా రాప్తాడులో మ‌రో ప‌రువు హ‌త్య జ‌రిగింది. దీనికి సంబంధించి పోలీసులు చెప్పిన వివ‌రాలిలా ఉన్నాయి. క‌న‌గాన‌ప‌ల్లికి చెందిన చిట్ర ముర‌ళీ కృష్ష(27)పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసి పెనుకొండ‌లోని […]

Capture
X

నేటి స‌మాజంలో వేషానికే నాగ‌రిక‌త త‌ప్ప భావాల్లో ఇంకా అనాగ‌రిక ఆలోచ‌న‌లే క‌న‌బ‌డుతున్నాయి. పైకి ఆథునికుల‌మ‌ని చెప్పుకునే కుటుంబాల్లో కూడా ఇంకా ప‌రువు ప‌ట్టుకుని వేలాడుతూ అమాయ‌కులైన ప్రేమికుల ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో ఈ ప‌రువు హ‌త్య‌లు ఎక్కువ‌వుతూ మాన‌వ‌త్వాన్ని ప్ర‌శ్నార్ధ‌కం చేస్తున్నాయి. తాజాగా స‌త్య‌సాయి జిల్లా రాప్తాడులో మ‌రో ప‌రువు హ‌త్య జ‌రిగింది. దీనికి సంబంధించి పోలీసులు చెప్పిన వివ‌రాలిలా ఉన్నాయి.

క‌న‌గాన‌ప‌ల్లికి చెందిన చిట్ర ముర‌ళీ కృష్ష(27)పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసి పెనుకొండ‌లోని కియా ఫ్యాక్ట‌రీ లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వీణ అనే యువ‌తి, ముర‌ళీ కొంంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీణ డిగ్రీ పూర్తి చేసి మూడేళ్ల క్రితం గ్రామ మహిళా పోలీసుగా ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేస్తోంది. ఇద్ద‌రికీ ఉద్యోగాలు రావ‌డంతో గ‌త యేడాది జూన్ లో వీణ, మురళి పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అనంతరం రాప్తాడులో కాపురం పెట్టారు.

ఈ క్రమంలో నిన్న‌ విధుల కోసం వెళ్లేందుకు రాప్తాడు వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి మురళిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. విధుల నుంచి ఇంటికి చేరుకున్న వీణ.. భర్తకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానించింది. వెంటనే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ముర‌ళీ కోసం వెదికింది.

ఆచూకీ లేకపోవడంతో రాప్తాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగానే లింగనపల్లి-రామినేపల్లి గ్రామాల మధ్య మురళి విగత జీవిగా కనిపించాడు. అత‌ని గొంతు చ‌ట్టూ క‌త్తి గాయాలు ఉండ‌డంతో గొంతు కోసి హ‌త్య చేశార‌ని పోలీసులు భావిస్తున్నారు. తాము ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేక తల్లే తన భర్తను హత్య చేయించిందని వీణ ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  17 Jun 2022 11:56 PM GMT
Next Story