Telugu Global
National

‘మా అమ్మ ఆరోగ్యం బాగా లేదు విచారణ వాయిదా వేయండి’

తన తల్లి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమె ఆసుపత్రిలో ఉందని కాబట్టి తన విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీకి లేఖ రాశారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గత మూడ్రోజులుగా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం కూడా విచారణకు హాజరుకావాలంటూ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ […]

‘మా అమ్మ ఆరోగ్యం బాగా లేదు విచారణ వాయిదా వేయండి’
X

తన తల్లి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమె ఆసుపత్రిలో ఉందని కాబట్టి తన విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీకి లేఖ రాశారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గత మూడ్రోజులుగా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం కూడా విచారణకు హాజరుకావాలంటూ రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ లేఖ రాశారు.

కాగా, ఈడీ అధికారులు ఈ రోజు విచారానికి విరామం ఇచ్చారు. ఆసుపత్రిలో ఉన్న తల్లి వద్దకు వెళ్లాలన్న రాహుల్ విజ్ఞప్తితో నేటి విచారణ నిలిపివేశారు. దాంతో రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి తల్లి సోనియా చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. ఇక, రేపటి విచారణను సోమవారానికి వాయిదా వేయాలన్న రాహుల్ తాజా విజ్ఞప్తికి ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

తమ అగ్రనేత రాహుల్ గాంధీని మనీలాండరింగ్ కేసులో ఈడీ ప్రశ్నిస్తుండడం పట్ల కాంగ్రెస్ వర్గాలు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి.

First Published:  16 Jun 2022 7:54 PM GMT
Next Story