Telugu Global
National

గోరక్షకులపై వ్యాఖ్యల వివాదం మీద ఇప్పుడే స్పందించను : సాయి పల్లవి

‘కశ్మీర్‌లో మతం పేరిట పండిట్లపై జరిగిన హత్యాకాండ.. గోరక్షణ పేరుతో ఒక వర్గంపై చేసే హత్యలు రెండూ ఒకలాంటివే’ అంటూ సినీ నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాను నటించిన విరాటపర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలో ఒక యూట్యూబ్ చానల్‌లో పై అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో వివాదం మొదలైంది. సాయి పల్లవి మాటలు సబబేనని.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న హింసపై స్పందించడం […]

actress-sai-pallavi-said-iam-not-respond-now-contr
X

‘కశ్మీర్‌లో మతం పేరిట పండిట్లపై జరిగిన హత్యాకాండ.. గోరక్షణ పేరుతో ఒక వర్గంపై చేసే హత్యలు రెండూ ఒకలాంటివే’ అంటూ సినీ నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాను నటించిన విరాటపర్వం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ క్రమంలో ఒక యూట్యూబ్ చానల్‌లో పై అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో వివాదం మొదలైంది.

సాయి పల్లవి మాటలు సబబేనని.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న హింసపై స్పందించడం ఆమె ధైర్యానికి నిదర్శనమని పలువురు మద్దతుపలికారు. అదే సమయంలో గోరక్షణ చేయడం నేరమా? అంటూ ఒక వర్గం ఆమెపై విమర్శలు గుప్పించారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు ఏకంగా ఆమెపై సుల్తాన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమె తొలి సారి ఈ వివాదంపై స్పందించారు.

విరాటపర్వం విడుదలకు ముందు జరిగిన ప్రివ్యూ షో సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. గోరక్షకుల ఆగ్రహంపై ఆమెను ప్రశ్నించగా.. ఇప్పుడు ఆ విషయంపై మాట్లాడలేను. నాకు కొంచెం సమయం ఇవ్వండని సాయి పల్లవి చెప్పారు. ‘మీరు ఎంతో ప్రేమతో నన్ను ఆ వివాదం నుంచి బయట పడేయాలని ప్రయత్నిస్తున్నారు. మీ ఆత్రుత నాకు తెలుసు. కానీ ఇప్పుడే నేను ఏమీ మాట్లాడలేను. నాకు కొంచెం సమయం ఇవ్వండి’ అని చెప్పుకొచ్చారు.

కాగా, వేణు ఉడుగుల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ పతాకంపై రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో వచ్చిన విరాటపర్వం సినిమా ఇవాళ విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

First Published:  16 Jun 2022 8:30 PM GMT
Next Story