Telugu Global
NEWS

సీఎం, మంత్రి రోజాపై అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి రోజాపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బహిరంగసభలోనే నోటికి వచ్చినట్టు బూతులు తిట్టారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తానని జగన్ అంటున్నారని.. అసలు ఈ శాడిస్ట్ ఏం పీకాడని 175 సీట్లు వస్తాయని ప్రశ్నించారు. 25 ఎంపీలను గెలిపిస్తే మోడీ మెడలు వంచుతానని కథలు చెప్పిన జగన్.. ఇప్పటికి 15 సార్లు మోడీ దగ్గరకు వెళ్లారని..వెళ్లిన ప్రతిసారి గదిలో 20 నిమిషాలు ఉంటున్నాడని.. అక్కడ ఏం […]

insulting-comments-tdp-leader-ayyanna-patrudu
X

ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి రోజాపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బహిరంగసభలోనే నోటికి వచ్చినట్టు బూతులు తిట్టారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తానని జగన్ అంటున్నారని.. అసలు ఈ శాడిస్ట్ ఏం పీకాడని 175 సీట్లు వస్తాయని ప్రశ్నించారు.

25 ఎంపీలను గెలిపిస్తే మోడీ మెడలు వంచుతానని కథలు చెప్పిన జగన్.. ఇప్పటికి 15 సార్లు మోడీ దగ్గరకు వెళ్లారని..వెళ్లిన ప్రతిసారి గదిలో 20 నిమిషాలు ఉంటున్నాడని.. అక్కడ ఏం పిసుకుతున్నాడని ప్రశ్నించారు. కాళ్లే పిసుకుతున్నారా లేక ఇంకేమైనా పిసుకుతున్నారా అని మాట్లాడారు. జగన్‌కు దమ్ముంటే ఇప్పుడు పాదయాత్ర చేయాలని, చీపుర్లతో కొట్టకపోతే అప్పుడు అడగాలన్నారు.

మద్యం షాపుల్లో కేవలం నగదు మాత్రమే తీసుకుంటూ సాయంత్రానికి అందులో సగం జగన్‌ కొట్టేస్తున్నారని విమర్శించారు. మంత్రి రోజా టీడీపీ నేతలు మగాళ్లు కాదు అంటున్నారని.. తాము మగాళ్లమో కాదో ఆమెకు ఎలా తెలుసని ప్రశ్నించారు. కావాలంటే ఒకసారి తన వద్ద గానీ, లోకేష్ వద్ద గానీ టెస్ట్‌ చేయించుకోవాలని అనుచితంగా మాట్లాడారు. ఇప్పటికే మొగుడికి చీర కట్టి ఇంట్లో కూర్చోబెట్టిన రోజా ఇప్పుడు రాష్ట్రంలో మగాళ్లందరికీ చీరలు కట్టిస్తానంటోందని విమర్శించారు.

పోలీసులపైనా తీవ్ర పదజాలంతో అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం బహిరంగసభలో అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

First Published:  15 Jun 2022 8:57 AM GMT
Next Story