Telugu Global
NEWS

జూబ్లీహిల్స్ రేప్ కేసు : అత్యాచార నిందితులు తన్నుకున్నారు

అమ్నీషియా పబ్ మైనర్ అత్యాచారం కేసులో జువైనల్ హోంలో ఉన్న నిందితులు గొడవ‌కు దిగారని తెలుస్తోంది. ఈ పరిస్థితికి నువ్వంటే నువ్వే కారణమంటూ ఒకరిని ఒకరు బూతులు తిట్టుకున్నారని, ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారని తెలుస్తోంది. నువ్వు పబ్ కు తీసుకెళ్ళడంవల్లనే ఇదంతా జరిగిందని ఓ మైనర్ పై మిగతావాళ్ళు ఆరోపణలు చేయగా బాలికను ట్రాప్ చేసింది మీరేనంటూ ఆమైనర్ కౌంటర్ ఇచ్చాడు. వీళ్ళ మధ్య గొడవ తారాస్థాయికి స్థాయికి చేరగా పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పినట్టు […]

జూబ్లీహిల్స్ రేప్ కేసు : అత్యాచార నిందితులు తన్నుకున్నారు
X

అమ్నీషియా పబ్ మైనర్ అత్యాచారం కేసులో జువైనల్ హోంలో ఉన్న నిందితులు గొడవ‌కు దిగారని తెలుస్తోంది. ఈ పరిస్థితికి నువ్వంటే నువ్వే కారణమంటూ ఒకరిని ఒకరు బూతులు తిట్టుకున్నారని, ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారని తెలుస్తోంది. నువ్వు పబ్ కు తీసుకెళ్ళడంవల్లనే ఇదంతా జరిగిందని ఓ మైనర్ పై మిగతావాళ్ళు ఆరోపణలు చేయగా బాలికను ట్రాప్ చేసింది మీరేనంటూ ఆమైనర్ కౌంటర్ ఇచ్చాడు. వీళ్ళ మధ్య గొడవ తారాస్థాయికి స్థాయికి చేరగా పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పినట్టు సమాచారం.

కాగా పోలీసుల విచారణ సందర్భంగా కూడా మైనర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కుమారుడే ముందు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు సాదుద్దీన్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.

పోలీసుల విచారణలో సాదుద్దీన్ పలు సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. పబ్ కు రావడంతోనే కార్పోరేటర్ కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు ఇద్దరు కలిసి అమ్మాయిలకోసం వెతకడం ప్రారంభించారని, కొందరు బాలికలను వేధించారని చెప్పినట్టు సమాచారం. తాను ఎంత చెప్పినా వినకుండా వాళ్ళిద్దరూ బాధిత బాలిక వెంటపడ్డారని, వేధించారని, ఆమెను మభ్యపెట్టి కార్లో ఎక్కించుకున్నారని సాదుద్దీన్ వెల్లడించాడు. కారులో ఆ బాలికను వాళ్ళిద్దరే వేధించారని సాదుద్దీన్ పోలీసులకు చెప్పాడు.

First Published:  13 Jun 2022 4:36 AM GMT
Next Story