Telugu Global
National

ముస్లింల నిరసనలపై తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ నాయకులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లు మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల పట్ల ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన‌ విషయం తెలిసిందే. ఈ విషయంపై బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు చేస్తున్న నిరసనలు, ప్రదర్శన‌లు హింపై తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఆందోళనలను ఖండించిన తస్లీమా.. మహ్మద్ ప్రవక్త కనుక ఇప్పుడు బతికి ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల మతోన్మాద పిచ్చిని […]

ముస్లింల నిరసనలపై తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు
X

బీజేపీ నాయకులు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లు మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల పట్ల ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన‌ విషయం తెలిసిందే. ఈ విషయంపై బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముస్లింలు చేస్తున్న నిరసనలు, ప్రదర్శన‌లు హింపై తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఆందోళనలను ఖండించిన తస్లీమా.. మహ్మద్ ప్రవక్త కనుక ఇప్పుడు బతికి ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల మతోన్మాద పిచ్చిని చూసి ఆయన దిగ్భ్రాంతికి గురై ఉండేవారంటూ ట్వీట్ చేశారు.

కాగా తస్లీమా నస్రీన్ భారత దేశంలో ఆశ్ర‌యం పొందుతున్న బంగ్లాదేశ్ కు చెందిన రచయిత. ఈమె ముస్లింల పై, వాళ్ళలో ఉన్న కొందరి మతోన్మాదంపై ఎప్పుడూ విమర్షలు చేస్తూ ఉంటుంది.

First Published:  11 Jun 2022 12:10 AM GMT
Next Story