Telugu Global
National

పెళ్ళికి నిరాకరించడంతో మహిళ ముఖంపై ఆసిడ్ పోసిన దుర్మార్గుడు

పెళ్ళికి నిరాకరించడంతో ఓ మహిళ ముఖంపై ఓ వ్యక్తి ఆసిడ్ పోశాడు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన‌లో నిందితుడు అహ్మద్ ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుల్లోని ఒక అగర్బత్తీల కంపెనీలో పని చేస్తున్న 32 ఏళ్ళ మహిళకు ముగ్గురు పిల్లలు. భర్తతో విభేదాలతో విడాకులు తీసుకుంది. అదే కంపెనీలో పని చేస్తున్న అహ్మద్ అనే వ్యక్తి తనను పెళ్ళి చేసుకోవల్సిందిగా చాలా కాలంగా వేదిస్తున్నాడు. ప్రతి సారీ ఆమె అహ్మద్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇవ్వాళ్ళ […]

acid attack
X

పెళ్ళికి నిరాకరించడంతో ఓ మహిళ ముఖంపై ఓ వ్యక్తి ఆసిడ్ పోశాడు. బెంగళూరులో జరిగిన ఈ సంఘటన‌లో నిందితుడు అహ్మద్ ను పోలీసులు అరెస్టు చేశారు.

బెంగళూరుల్లోని ఒక అగర్బత్తీల కంపెనీలో పని చేస్తున్న 32 ఏళ్ళ మహిళకు ముగ్గురు పిల్లలు. భర్తతో విభేదాలతో విడాకులు తీసుకుంది. అదే కంపెనీలో పని చేస్తున్న అహ్మద్ అనే వ్యక్తి తనను పెళ్ళి చేసుకోవల్సిందిగా చాలా కాలంగా వేదిస్తున్నాడు. ప్రతి సారీ ఆమె అహ్మద్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇవ్వాళ్ళ అహ్మద్ పథకం ప్రకారం ఆసిడ్ బాటిల్ తీసుకొని ఆ మహిళ దగ్గరికి వచ్చాడు మళ్ళీ పెళ్ళి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఆమె మళ్ళీ తిరస్కరించింది. వెంటనే కోపంతో అతను ఆసిడ్ ను ఆమె ముఖంపై పోశాడు. చుట్టుపక్కల వాళ్ళు ఆమెను వెంటనే దగ్గర్లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఆమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

“ఆమె ప్రమాదం నుండి బయటపడింది. ఆమె కంటి చూపు కూడా పాక్షికంగా పునరుద్ధరించబడింది. ఆమె త్వరగా పూర్తిగా కోలుకుంటుందని మేము ఆశిస్తున్నాము” అని సౌత్ డిసిపి హరీష్ పాండే తెలిపారు.

సంఘటన‌ జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయిన అహ్మద్ ను కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు.

First Published:  10 Jun 2022 6:14 AM GMT
Next Story