జూమ్లో లోకేష్కు ఎదురుపడ్డ కొడాలి, వంశీ.. దేవందర్ రెడ్డితో వాగ్వాదం
పదో తరగతి విద్యార్థులతో నారా లోకేష్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు నారా లోకేష్కు ఎదురెళ్లారు. విద్యార్థులతో కలిసి జూమ్లో ఇద్దరు నేతలు పాల్గొన్నారు. నారా లోకేష్ కు కౌంటర్ ఇచ్చేలా మాట్లాడేందుకు కొడాలి, వంశీ సిద్ధమవగా నిర్వాహకులు మ్యూట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్తో పాటు డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్గా, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవులు నిర్వహిస్తున్న గుర్రంపాటి దేవేందర్ […]
పదో తరగతి విద్యార్థులతో నారా లోకేష్ నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు నారా లోకేష్కు ఎదురెళ్లారు. విద్యార్థులతో కలిసి జూమ్లో ఇద్దరు నేతలు పాల్గొన్నారు.
నారా లోకేష్ కు కౌంటర్ ఇచ్చేలా మాట్లాడేందుకు కొడాలి, వంశీ సిద్ధమవగా నిర్వాహకులు మ్యూట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్తో పాటు డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్గా, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవులు నిర్వహిస్తున్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి కూడా జూమ్లోకి వెళ్లారు. నారా లోకేష్ ఉద్దేశించి దేవేందర్ రెడ్డి.. ”నువ్వు… నీబాబు” అంటూ ఏకవచనంతో మాట్లాడగా నారా లోకేష్ అభ్యంతరం తెలిపారు.
పిల్లలతో మాట్లాడుతుంటే వారిని అడ్డుపెట్టుకుని లైవ్లోకి రావడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్గా ఉంటూ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఎలా దోచుకుంటున్నావో కూడా తనకు తెలుసని దేవేందర్ రెడ్డిని ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యలు చేశారు.
కొడాలి నాని, వల్లభనేని వంశీ రావడంపైనా లోకేష్ అభ్యంతరం తెలిపారు. సన్నబియ్యం మాజీ మంత్రి, పార్టీ ఉంచి మరో పార్టీలోకి వెళ్లిన వ్యక్తి పిల్లలు ముసుగులో లైవ్లోకి వచ్చారని. అందరూ చూడండి అంటూ లోకేష్ కోరారు.