Telugu Global
NEWS

సికింద్రాబాద్ లో బాలికపై సామూహిక‌ అత్యాచారం

జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచారం సంఘటన‌ మరవక ముందే సికింద్రాబాద్ లో మరో ఘోర సంఘటన జరిగింది. కార్ఖానా పరిధిలో బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఐదుగురిలో ఒకరు బాలుడు. కార్ఖానా ప్రాంతంలో ఓ బాలికతో ధీరజ్, రితేశ్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెం చుకున్నా రు. అనం తరం ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను శారీరకం గా లోబర్చు కున్నా రు. ఆ వీడియోలు తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేశారు. ఆమె […]

సికింద్రాబాద్ లో బాలికపై సామూహిక‌ అత్యాచారం
X

జూబ్లీహిల్స్ లో బాలికపై అత్యాచారం సంఘటన‌ మరవక ముందే సికింద్రాబాద్ లో మరో ఘోర సంఘటన జరిగింది. కార్ఖానా పరిధిలో బాలికపై ఐదుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఐదుగురిలో ఒకరు బాలుడు.

కార్ఖానా ప్రాంతంలో ఓ బాలికతో ధీరజ్, రితేశ్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెం చుకున్నా రు. అనం తరం
ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెను శారీరకం గా లోబర్చు కున్నా రు. ఆ వీడియోలు తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేశారు. ఆమె బతిమిలాడగా వీడియోలు ఇచ్చేస్తామని నమ్మబలికి ఆమెను తమ దగ్గరికి రప్పించుకున్నారు. అక్కడ ఇతర స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు.

బాలిక ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఆమె మానసిక పరిస్థితి పూర్తిగా క్షీణించింది. దాంతో కంగారుపడ్డ తల్లితండ్రులు ఆ బాలికను మానసిక వైద్యుడికి చూపించారు. బాలిక ఆ వైద్యుడితో జరిగిన విషయం చెప్పింది. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులుకు పిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.నిందితుల్లో ఓ బాలుడు కూడా ఉన్నా డు. బాలుడు మినహా మిగతా వారిని పోక్సో చట్టం కిం ద అరెస్ట్ చేసి రిమాం డ్ కు తరలిం చారు. బాలుడిని జువైనల్ హోం కి తరలిం చినట్లు సమాచారం.

First Published:  6 Jun 2022 8:56 PM GMT
Next Story