Telugu Global
National

నుపుర్ శర్మ పోయి… సాధ్వి అన్నపూర్ణ వచ్చె…. మరో హేట్ స్పీచ్ కేసు…

నుపుర్ శర్మ వివాదం సమసిపోక ముందే మరో హిందుత్వ నాయకురాలు ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన విద్వేష‌ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ లో అఖిల భారత హిందూ మహాసభ జాతీయ కార్యదర్శిగా చెప్పుకుంటున్న సాధ్వి అన్నపూర్ణ అలియాస్ పూజా శకున్ పాండేపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచే విధంగా వ్యాఖ్యానాలు చేసినందుకు ఈ కేసు నమోదు చేసినట్టు అలీఘర్ పోలీసులు ప్రకటించారు. “వివాదాస్పద వ్యాఖలకు సంబంధించి పూజా […]

నుపుర్ శర్మ
X

నుపుర్ శర్మ వివాదం సమసిపోక ముందే మరో హిందుత్వ నాయకురాలు ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన విద్వేష‌ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ లో అఖిల భారత హిందూ మహాసభ జాతీయ కార్యదర్శిగా చెప్పుకుంటున్న సాధ్వి అన్నపూర్ణ అలియాస్ పూజా శకున్ పాండేపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచే విధంగా వ్యాఖ్యానాలు చేసినందుకు ఈ కేసు నమోదు చేసినట్టు అలీఘర్ పోలీసులు ప్రకటించారు.

“వివాదాస్పద వ్యాఖలకు సంబంధించి పూజా శకున్ పాండేపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదైంది. ఆమెపై ఐపిసి సెక్షన్ 153A/153B/295A/298/505 కింద గాంధీపార్క్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది” అని అలీఘర్ పోలీసు సూపరింటెండెంట్ కళానిధి నైతాని తెలిపారు.

ఈ విధంగా ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పూజా శకున్ పాండేకు కొత్తేమీ కాదు.
ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఈమెను గత రెండేళ్ళలో అలీఘర్ పోలీసులు రెండుసార్లు అరెస్టు చేశారు. ఆ రెండు కేసులలో ఆమె బెయిల్ పొందారు.

పాండేతో సహా మరికొందరు హిందూ మత పెద్దలపై గత సంవత్సరం హరిద్వార్ “ధర్మ‌ సంస‌ద్” (మత సభ)లో ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఏడాది ప్రారంభంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన “ధర్మ‌ సంసద్”లో ఈమె చేసిన ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

డిసెంబరు 17, 19 మధ్య, ఢిల్లీలో హిందూ యువ వాహిని , హరిద్వార్‌లో యతి నర్సింహానంద్ నిర్వహించిన రెండు కార్యక్రమాలలో ఈమె ముస్లింలపై హింసకు పాల్పడాలంటూ హిందువులకు బహిరంగ పిలుపునివ్వడమే కాక‌ ద్వేషపూరిత ప్రసంగాలు చేశారు.

పూజా శకున్ 2019లో అలీఘర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మహాత్మా గాంధీ దిష్టిబొమ్మపై కాల్పులు జరిపి, నాథూరామ్ గాడ్సేను కీర్తిస్తూ నినాదాలు చేసింది.

First Published:  7 Jun 2022 2:20 AM GMT
Next Story