Telugu Global
NEWS

పవన్ పరువు తీసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఒకే ఒక్క ట్వీట్‌తో జనసేనాని పరువు మొత్తం తీసేశారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాబోయే ఎన్నికల పొత్తులకు సంబంధించి పవన్ 3-ఆప్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాస్త తగ్గాలని, ఈ సారి తాము తగ్గేదే లేదని పొత్తుల విషయంలో ఒక ఆప్షన్ ఇచ్చారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘క్వింటా కాటా తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు […]

పవన్ పరువు తీసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
X

ఒకే ఒక్క ట్వీట్‌తో జనసేనాని పరువు మొత్తం తీసేశారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాబోయే ఎన్నికల పొత్తులకు సంబంధించి పవన్ 3-ఆప్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాస్త తగ్గాలని, ఈ సారి తాము తగ్గేదే లేదని పొత్తుల విషయంలో ఒక ఆప్షన్ ఇచ్చారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

‘క్వింటా కాటా తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి.. కానీ ఆ కొన్ని వడ్ల వల్లనే మొత్తం కాటా తూగింది అనుకుంటే ఎలా.. సేనాధిపతి..!’ అంటూ ట్వీట్ చేశారు. కాటాలో ఆఖర్లో పడే వడ్ల వంటి వారనే రీతిలో జనసేన పరువు తీయడం దారుణమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గోరంట్ల ట్వీట్‌తో జనసేన, టీడీపీ మధ్య మాటల యుద్దం పెరిగిపోయింది.

రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చింది. ఆ రోజు తమ వల్లే టీడీపీ గెలిచిందనే భావన పవన్ కల్యాణ్‌లో కూడా ఉన్నది. ప్రతీసారి తామే త్యాగం చేస్తున్నాము.. ఈ సారి మీరు చేయండని పవన్ అనడంపై కూడా అప్పటి చులకన భావనే కారణం అనుకుంటున్నారు. అసలు టీడీపీ పొత్తుల గురించి మాట్లాడకుండానే.. పవన్ కల్యాణ్ ఎలా ఈ ప్రస్తావన తీసుకొని వస్తారని అంటున్నారు. ఇది రెండు పార్టీలకు మంచిది కాదని టీడీపీ అభిమానులు చెబుతున్నారు.

ఇప్పటికీ టీడీపీని గెలిపించేదనే భావనలో కల్యాణ్ ఉండటం వల్లనే జనసేన కార్యకర్తలు దూకుడైన వ్యాఖ్యలు చేస్తున్నారని.. వారిని కట్టడి చేయాలంటే గోరంట్ల లాంటి ట్వీట్లే క‌రెక్ట్ అని టీడీపీ కార్యక‌ర్త‌లు కూడా అంటున్నారు.

First Published:  6 Jun 2022 2:58 AM GMT
Next Story