Telugu Global
NEWS

కాళ్లు విరగ్గొడతానంటూ కేఏ పాల్‌కు శ్రీకాంతాచారి తల్లి వార్నింగ్

తన కుటుంబంలో చిచ్చు పెట్టిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ హెచ్చరించారు. భర్త వెంకటాచారిని మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్నారని.. కేసీఆర్, కేటీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు విమర్శులు చేస్తే కాళ్లు విరగ్గొడతానని పాల్‌కు శంకరమ్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఉన్న శ్రీకాంతాచారి విగ్రహం వద్ద ఆమె మీడియాకు పలు వివరాలు తెలియజేశారు. తన భర్త వెంకటాచారిని భద్రాచారి అనే వ్యక్తి రూ. […]

కాళ్లు విరగ్గొడతానంటూ కేఏ పాల్‌కు శ్రీకాంతాచారి తల్లి వార్నింగ్
X

తన కుటుంబంలో చిచ్చు పెట్టిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ హెచ్చరించారు. భర్త వెంకటాచారిని మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్నారని.. కేసీఆర్, కేటీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు విమర్శులు చేస్తే కాళ్లు విరగ్గొడతానని పాల్‌కు శంకరమ్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఉన్న శ్రీకాంతాచారి విగ్రహం వద్ద ఆమె మీడియాకు పలు వివరాలు తెలియజేశారు.

తన భర్త వెంకటాచారిని భద్రాచారి అనే వ్యక్తి రూ. 20 లక్షల ప్యాకేజీ మాట్లాడుకొని కేఏ పాల్ దగ్గరకు తీసుకొని వెళ్లి ప్రజాశాంతి పార్టీలో చేర్పించారని ఆరోపించారు. తన భర్తను పాల్ బంధించి తన దగ్గర పెట్టుకున్నాడన్నారు. ఇక గత 15 రోజులుగా పాల్ మనుషులు తనపై ఒత్తిడి తీసుకొని వస్తున్నారని అన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇప్పిస్తానని చెబుతూ… పార్టీలో చేరాలని అంటున్నారన్నారు. ఇంకా ఆమె ఏం చెప్పారంటే..

‘వీళ్లు రోజూ వస్తుండటంతో నాకు తెలిసిన అడ్వకేట్ నర్సింహారావు ఉంటే ఆయనకు చెప్పిన. సారూ వీళ్లు నాకు రాజ్యసభ ఇస్తామంటున్నారు. రాత్రి ఒంటి గంటకు వచ్చి టార్చర్ పెడుతున్నారని చెప్తే.. నేను కలిసొస్తా అమ్మా అని ఆ సారు పోయిండు. అక్కడ వాళ్లు మేం రాజ్యసభ ఇప్పిస్తాము అని సార్‌కు చెప్పిన్రు. అయితే పొద్దున మూడు గంటలకు రాజ్యసభ సీటు ఇచ్చేదెవరని సార్ అడిగారు. నీది కనీసం అధికార పార్టీకాదు, నీకు సీట్లు లేవు కదా అని కూడా సార్ ప్రశ్నించిండు. ఇంకా సార్ ఏమన్నడంటే రాజ్యసభ ఎలాగో ఇయ్యరు కదా.. ఇయ్యకుంటే ఆమెకు ఒక నలబై యాబై కోట్లు ఇవ్వండి. ఆమె కూర్చొని తింటది. మీ పార్టికి పని చేస్తది అని అన్నడు. నేను కూడా 40 నిమిషాలు కేఏ పాల్‌తో మాట్లాడిన. కానీ నేనసలు అమౌంట్ గురించే మాట్లాడలేదని’ శంకరమ్మ చెప్పింది.

అడ్వొకేట్ నర్సింహరావు ఏదో మాట్లాడితే.. నేను రూ. 40 కోట్లు అడిగినట్లు కేఏపాల్ ప్రచారం చేస్తున్నారన్నారు. వెంకటాచారి రూ. 40 జేబులో వేసుకొని వస్తే.. తాను రూ. 40 కోట్లు అడిగినట్లు అబద్దపు ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు. మా ఫ్యామిలీ ఇజ్జత్ తీయడానికే ఇలా చేస్తున్నారు. నేను కచ్చితంగా కేఏపాల్ మీద పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

కేవలం కేసీఆర్‌ను తిట్టించడానికే తన భర్తను కేఏపాల్ తీసుకొని వెళ్లాడని.. అసలు కేసీఆర్ కాలి గోటికి కూడా పాల్ సరిపోడని అన్నారు. నా మీద లేనిపోని ప్రచారం చేస్తున్న కేఏపాల్ కాళ్లు విరగ్గొడతానని తీవ్రంగా హెచ్చరించారు. 1000 మంది అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షల విలువైన ఇళ్లు కట్టించి ఇచ్చే పార్టీకే తన మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

First Published:  6 Jun 2022 1:41 AM GMT
Next Story