Telugu Global

హైదరాబాద్ మైనర్ అత్యాచారంలో ఎమ్మెల్యే కొడుకు… ఫోటోలు రిలీజ్ చేసిన రఘునందన్ రావు

హైదరాబాద్ అమ్నీషియా పబ్ మైనర్ అత్యాచారం కేసులో పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. దీనిపై ఒకవైపు ప్రతిపక్షాలు ఆందోళనల బాట చేపట్టగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకంగా కొన్ని ఫోటోలు రిలీజ్ చేసి పోలీసులకు చుక్కలు చూపించారు. ఓ ఎంఐఎం ఎం ఎల్ ఏ కొడుకు బెంజ్ కారులో సదరు అమ్మాయితో అసభ్యంగా వ్యవహరిస్తున్న ఫొటోలను రఘునందన్ రావు విడుదల చేశారు. అత్యాచారం చేసిన వాళ్ళను పోలీసులు రక్షిస్తున్నారని ఆయన మండి పడ్డారు. నిందితులను ఇప్పటికే దేశం […]

హైదరాబాద్ మైనర్ అత్యాచారంలో ఎమ్మెల్యే కొడుకు… ఫోటోలు రిలీజ్ చేసిన రఘునందన్ రావు
X

హైదరాబాద్ అమ్నీషియా పబ్ మైనర్ అత్యాచారం కేసులో పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. దీనిపై ఒకవైపు ప్రతిపక్షాలు ఆందోళనల బాట చేపట్టగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకంగా కొన్ని ఫోటోలు రిలీజ్ చేసి పోలీసులకు చుక్కలు చూపించారు.

ఓ ఎంఐఎం ఎం ఎల్ ఏ కొడుకు బెంజ్ కారులో సదరు అమ్మాయితో అసభ్యంగా వ్యవహరిస్తున్న ఫొటోలను రఘునందన్ రావు విడుదల చేశారు. అత్యాచారం చేసిన వాళ్ళను పోలీసులు రక్షిస్తున్నారని ఆయన మండి పడ్డారు. నిందితులను ఇప్పటికే దేశం దాటించారని ఆయన ఆరోపించారు.

”అత్యాచారం చేసిన బెంజ్ కారులో ఉన్నవాళ్ళను వదిలేసి ఇన్నోవా కారులో ఉన్నవాళ్ళను నిందితులుగా చూపిస్తున్నారు. నేను చూపిస్తున్న ఈ ఫోటో ఎమ్మెల్యే కొడుకుది అవునా కాదా పోలీసులు చెప్పాలి. ఎమ్మెల్యే కొడుకు లేడని పోలీసులే ఎలా చెప్తారు. ఆ విషయం తేల్చాల్సింది కోర్టు. ఈ కేసును సీబీఐ కి అప్పగించాలి. ఒక వేళ ప్రభుత్వం ఆపని చేయకపోతే నేనే సుప్రీం కోర్టుకు వెళ్తాను” అని రఘునంద రావు అన్నారు.

పోలీసు కంట్రోలింగ్ మొత్తం ఎమ్ ఐ ఎం చేతుల్లో ఉందని అవసరమైతే టీఆరెస్ వాళ్ళనైనా అరెస్టు చేస్తారు కానీ ఎంఐఎమ్ వాళ్ళ జోలికి మాత్రం పోరని ఆయన ఆరోపించారు.

కాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫోటోలు రిలీజ్ చేసిన నేపథ్యంలో పోలీసు శాఖ ఉలిక్కిపడింది. ఎస్బీ , లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులతో పాటు పలువురు అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హుటాహుటిన సమావేశమయ్యారు. నిందితుల ఫోటోలు రఘునందన్ రావుకు ఎలా చేరాయన్న దానిపై చర్చించినట్టు సమాచారం.

First Published:  4 Jun 2022 4:26 AM GMT
Next Story