Telugu Global
NEWS

బస్సు ప్రమాదం… ఒకే కుటుంబానికి చె‍ందిన‌ ఎనిమిది మంది సజీవ దహనం

ఈ రోజు తెల్లవారు జామున జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనం అయ్యారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు కర్నాటకలోని కలబురగి జిల్లా కమలాపురా పట్టణం శివార్లలో ఓ జీబును ఢీకొట్టి పక్కనున్న గుంతలో పడింది. దాంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో 28 మంది ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. కొంత మంది […]

బస్సు ప్రమాదం… ఒకే కుటుంబానికి చె‍ందిన‌ ఎనిమిది మంది సజీవ దహనం
X

ఈ రోజు తెల్లవారు జామున జరిగిన ఓ బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు సజీవ దహనం అయ్యారు. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు కర్నాటకలోని కలబురగి జిల్లా కమలాపురా పట్టణం శివార్లలో ఓ జీబును ఢీకొట్టి పక్కనున్న గుంతలో పడింది. దాంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉండగా వారిలో 28 మంది ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. కొంత మంది తప్పించుకుని బస్సులోంచి కిందికి దూకేసినప్పటికీ , తప్పించుకునే దారిలేక ఆ మంటల్లో చిక్కుకొని ఎనిమిది మంది ప్రయాణీకులు మరణించినట్టు సమాచారం. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు అని తెలుస్తోంది. క్షతగాత్రులను కలబురగిలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించారు.

అర్జున్ కుమార్ అనే హైదరాబాద్ కు చెందిన వ్యక్తి తన కూతురు పుట్టినరోజు వేడుకల కోసం తన కుంటుంబాన్ని, బందువులను తీసుకొని గోవా వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో ఈ దారుణం జరిగింది. మరణించినవారిలో అర్జున్ కుమార్ (37)తో పాటు అతని భార్య (32), బివాన్‌ (4), దీక్షిత్‌ (9), అనితా రాజు (40), శివకుమార్‌ (35), రవళి (30)తో పాటు మరొకరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

First Published:  2 Jun 2022 11:42 PM GMT
Next Story