Telugu Global
MOVIE UPDATES

అక్కడ ‘దొంగలున్నారు జాగ్రత్త’

సురేష్ ప్రొడక్షన్స్‌, గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. యువ హీరో శ్రీసింహ కోడూరి మెయిన్ హీరో. డిఫరెంట్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. ‘దొంగలున్నారు జాగ్రత్త’ తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం కావడం విశేషం. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్సెలో ప్రీ-ప్రొడక్షన్ పనులను చూపించారు. సెట్‌ను సిద్ధం […]

అక్కడ ‘దొంగలున్నారు జాగ్రత్త’
X

సురేష్ ప్రొడక్షన్స్‌, గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. యువ హీరో శ్రీసింహ కోడూరి మెయిన్ హీరో. డిఫరెంట్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. ‘దొంగలున్నారు జాగ్రత్త’ తెలుగులో తొలి సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం కావడం విశేషం.

ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్సెలో ప్రీ-ప్రొడక్షన్ పనులను చూపించారు. సెట్‌ను సిద్ధం చేయడంతో పాటు, కస్టమ్-మేడ్ కారును కూడా సిద్ధం చేసినట్లు కనిపిస్తున్న ఈ వీడియో చివర్లో శ్రీ సింహ కోడూరి ఎంట్రీ ఇచ్చాడు. 72 మంది టీంతో 342 గంటల్లో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశామని మేకర్స్ వెల్లడించారు. అలాగే సినిమా మొత్తాన్ని సింగిల్ లొకేషన్ లో షూట్ చేశారు.

సినిమా కథాంశానికి వస్తే.. ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటిస్తుండగా, సముద్రఖని ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో కాలభైరవ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

దొంగలున్నారు జాగ్రత్త ఫస్ట్ గ్లింప్స్

First Published:  31 May 2022 11:02 AM GMT
Next Story