Telugu Global
NEWS

ఎలకేష్.. బోకేష్.. డోస్ పెంచిన విజయసాయి..

మహానాడు సూపర్ హిట్టైందని, వైసీపీ పనైపోయిందని టీడీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. లోకేష్ అనే పేరెత్తకుండానే.. ఎలకేష్, బోకేష్ అంటూ సెటైర్లు వేశారు. టీడీపీ మహానాడు కార్యక్రమంలో నారా లోకేష్ గొంతు సరిగా లేక ప్రసంగించే సమయంలో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆయన తరపున పయ్యావుల కేశవ్, లోకేష్ ప్రసంగ సారాంశాన్ని స్టేజ్ పై చదివి వినిపించారు. […]

ఎలకేష్.. బోకేష్.. డోస్ పెంచిన విజయసాయి..
X

మహానాడు సూపర్ హిట్టైందని, వైసీపీ పనైపోయిందని టీడీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. లోకేష్ అనే పేరెత్తకుండానే.. ఎలకేష్, బోకేష్ అంటూ సెటైర్లు వేశారు. టీడీపీ మహానాడు కార్యక్రమంలో నారా లోకేష్ గొంతు సరిగా లేక ప్రసంగించే సమయంలో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆయన తరపున పయ్యావుల కేశవ్, లోకేష్ ప్రసంగ సారాంశాన్ని స్టేజ్ పై చదివి వినిపించారు. దీనిపై కూడా విజయసాయి కామెంట్ చేశారు. లోకేష్ వాయిస్ పొగ గొట్టం లేని కిరసనాయిల్ కారు సౌండ్ అంటూ ఎద్దేవా చేశారు.

“మై డియర్‌ ఎలకేష్‌!
నీ ఫ్రస్ట్రేషన్‌ నాకు అర్థం అయ్యింది. ఎదర ఎలకకి ఉన్నంత… వెనక ఏనుగుకున్నంత! ఇదీ నీ సిస్టమ్‌! పైగా నీ వాయిస్‌ నిండా పొగ గొట్టం లేని కిరసనాయిల్‌ కారు సౌండే. దీనికి మమ్మల్ని తిట్టి ఏం ప్రయోజనం? కొన్నికొన్ని మారవు బాబూ! ”
అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

ఇక దావోస్ పర్యటనపై టీడీపీ చేస్తున్న విమర్శలను కూడా విజయసాయి తిప్పికొట్టారు. దావోస్ పర్యటనలో ఏపీకి పెద్దగా పెట్టుబడులు రాలేదని, ఇండియన్ కంపెనీల సీఈవోలతో కలిసేందుకు జగన్ దావోస్ వరకు ఎందుకెళ్లారంటూ లోకేష్ ప్రశ్నించారు. దీనికి విజయసాయి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. నీ బతుకు ఖావోస్.. నీకు దావోస్ గురించి ఎందుకు చెప్పు అని ట్వీట్ చేశారు.

“మై డియర్‌ బోకేష్‌!
ఎమ్మారై మెషిన్‌లో పెడితే నీకున్న బ్రెయిన్‌ ఆవగింజంత… స్కానింగ్‌ను ముందుకు కదుపుదాం అంటే మిగతాది సీమ పంది అంత! నీ బతుకే ఖావోస్‌… దావోస్‌ గురించి నీకెందుకు చెప్పు? మేసింది చాలు… మూసుకు కూర్చో!” అంటూ లోకేష్ కి తినడమే తెలుసునంటూ సెటైర్లు పేల్చారు విజయసాయిరెడ్డి.

First Published:  30 May 2022 11:35 AM GMT
Next Story