Telugu Global
NEWS

తెలుగు రాజ‌కీయాల‌పై మ‌రోసారి ఆస‌క్తి..

సినీనటి, మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద ఈ మేరకు వ్యాఖ్యానించారు. సినిమాల్లో అందాల తారగా, గొప్ప నటిగా ఓ వెలుగు వెలిగిన జయప్రద ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలోనూ టీడీపీలో కొనసాగారు. రాజ్యసభ సభ్యురాలయ్యారు. అయితే ఆ తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్ర […]

తెలుగు రాజ‌కీయాల‌పై మ‌రోసారి ఆస‌క్తి..
X

సినీనటి, మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద ఈ మేరకు వ్యాఖ్యానించారు. సినిమాల్లో అందాల తారగా, గొప్ప నటిగా ఓ వెలుగు వెలిగిన జయప్రద ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలోనూ టీడీపీలో కొనసాగారు. రాజ్యసభ సభ్యురాలయ్యారు.

అయితే ఆ తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించారు. సమాజ్ వాది పార్టీలో చేరి ఎంపీగా గెలుపొందారు. కొంతకాలంగా తర్వాత అక్కడ విభేదించి .. అమర్ సింగ్ తో కలిసి ఎస్పీ నుంచి బయటకు వచ్చేశారు. వీరిద్దరూ కలిసి ఓ రాజకీయపార్టీని స్థాపించినప్పటికీ పెద్దగా రాణించలేకపోయారు.

ఇక ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి రావాలని ఉందని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉనికి పెద్దగా లేదు. కానీ తెలంగాణలో కాస్త ఆ పార్టీ హడావుడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణలో ఏదైనా పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేయాలని భావిస్తున్నట్టున్నారు. ఒకవేళ కిషన్ రెడ్డి అసెంబ్లీకి పోటీచేస్తే .. సికింద్రాబాద్ నుంచి ఆమె టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. మరి బీజేపీ మదిలో ఏముందో? వేచి చూడాలి.

First Published:  30 May 2022 8:09 AM GMT
Next Story