Telugu Global
NEWS

ముస్లిం యువతిని ప్రేమించినందుకు దళిత యువకుడిని చంపేశారు

హైదరాబాద్ సరూర్ నగర్ లో ఈ మధ్యనే ఓ ముస్లిం యువతిని పెళ్ళి చేసుకున్నందుకు దళిత యువకుడిని హత్య చేసిన సంఘటన మర్చిపోకముందే కర్నాటకలో అలాంటిదే మరో సంఘటన జరిగింది. ఓ ముస్లిం యువతిని ప్రేమించినందుకు దళిత యువకుడిని ఆ యువతి కుటుంబ సభ్యులు హత్య చేశారు. కర్నాటకలోని కలబురగి జిల్లాలో జరిగిందీ ఘటన. కలబురగి జిల్లా వాడిటౌన్‌లోని భీమా నగర్ లేఅవుట్ లో నివాసముండే విజయ్ కాంబ్లే అనే యువకుడు, ఓ ముస్లిం యువతి ప్రేమించుకున్నారు. […]

ముస్లిం యువతిని ప్రేమించినందుకు దళిత యువకుడిని చంపేశారు
X

హైదరాబాద్ సరూర్ నగర్ లో ఈ మధ్యనే ఓ ముస్లిం యువతిని పెళ్ళి చేసుకున్నందుకు దళిత యువకుడిని హత్య చేసిన సంఘటన మర్చిపోకముందే కర్నాటకలో అలాంటిదే మరో సంఘటన జరిగింది.

ఓ ముస్లిం యువతిని ప్రేమించినందుకు దళిత యువకుడిని ఆ యువతి కుటుంబ సభ్యులు హత్య చేశారు. కర్నాటకలోని కలబురగి జిల్లాలో జరిగిందీ ఘటన.

కలబురగి జిల్లా వాడిటౌన్‌లోని భీమా నగర్ లేఅవుట్ లో నివాసముండే విజయ్ కాంబ్లే అనే యువకుడు, ఓ ముస్లిం యువతి ప్రేమించుకున్నారు. అది ఆ యువతి కుటుంబానికి నచ్చలేదు. ఆ యువతి సోదరుడు విజయ్ ని అనేక సార్లు బెదిరించాడు. యువతి సోదరుడు షాహుద్దీన్ ఇవ్వాళ్ళ విజయ్ ని ఫోన్ చేసి బైటికి పిలిచాడు. అనంతరం షాహుద్దీన్ తోపాటు నవాజ్ అనే మరో యువకుడు కలిసి విజయ్ పై దాడి చేశారు. ఇనుప రాడ్లతో కొట్టడమే కాక కత్తులతో పొడిచారు. దాంతో విజయ్ అక్కడికక్కడే చనిపోయాడు.

ఈ సంఘటన‌పై విజయ్ తల్లి మాట్లాడుతూ… ఫోన్ కాల్ రావడంతో విజయ్ ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఆ తరువాత కొద్ది సేపటికి అతన్ని కొట్టిపడేశారని నాకు కాల్ వచ్చింది. నేను అతని దగ్గరకు పరిగెత్తాను. వారు అప్పటికే విజయ్ ని కత్తితో పొడిచి తలపై కొట్టారు ”అని ఆమె చెప్పింది.

కాగా విజయ్ హత్యకు సంబంధించి షాహుద్దీన్, నవాజ్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కలబురగి ఎస్పీ ఇషా పంత్ తెలిపారు.

First Published:  27 May 2022 9:09 AM GMT
Next Story