Telugu Global
NEWS

KTR " Jagan: దావోస్ వేదిక.. అరుదైన కలయిక‌

అదో అరుదైన సమావేశం….గొప్ప కలియక….దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల సందర్భంగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిల సమావేశ‍ం జరిగింది. ”నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది” అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. అయితే వీరిద్దరు ఎంత సేపు భేటీ అయ్యారు. ఏ విషయాలు చర్చించుకున్నారు అనే అంశాలు తెలియరావాల్సి ఉంది. వీరిద్దరి కలియక వరల్డ్‌ […]

KTR  Jagan: దావోస్ వేదిక.. అరుదైన కలయిక‌
X

అదో అరుదైన సమావేశం….గొప్ప కలియక….దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల సందర్భంగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిల సమావేశ‍ం జరిగింది. ”నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది” అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

అయితే వీరిద్దరు ఎంత సేపు భేటీ అయ్యారు. ఏ విషయాలు చర్చించుకున్నారు అనే అంశాలు తెలియరావాల్సి ఉంది. వీరిద్దరి కలియక వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల్లో ఓ రకమైన ఆసక్తిని రేకెత్తించింది.

కాగా దావోస్ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ వివిధ అంతర్జాతీయ సంస్థలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వివరిస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున కేటీఆర్ ఒప్పందాలు కూడా చేసుకున్నారు.

First Published:  24 May 2022 12:00 AM GMT
Next Story