Telugu Global
Cinema & Entertainment

బుక్ మై షోతో 'మేజర్' ఒప్పందం

అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ట్రైలర్, పాటలకు విశేష స్పందన రావడంతో భారీగా అంచనాల పెరిగాయి. ముఖ్యంగా రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో అందరి దృష్టి పడింది. ఈ బయోపిక్ ని ఘనవిజయంగా మలిచి మేజర్ సందీప్ కి ఘనమైన నివాళి అర్పించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్ షోలు […]

major movie
X

అడివి శేష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ట్రైలర్, పాటలకు విశేష స్పందన రావడంతో భారీగా అంచనాల పెరిగాయి. ముఖ్యంగా రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో అందరి దృష్టి పడింది. ఈ బయోపిక్ ని ఘనవిజయంగా మలిచి మేజర్ సందీప్ కి ఘనమైన నివాళి అర్పించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్ షోలు ముందుగా చూస్తుంటాం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ప్రతి భారతీయుడు చూడవలసిన కథ. అందుకే రియల్ హీరో సందీప్ ‘మేజర్’ చిత్రానికి కూడా దేశవ్యాప్తంగా ప్రివ్యూలు ఉండబోతున్నాయి. ఇండియాలో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా సినిమాను ప్రదర్శించడానికి మేజర్ చిత్ర యూనిట్ బుక్‌మైషో యాప్ తో జతకట్టింది. జూన్ 3న అధికారికంగా విడుదలకాబోయే ముందే ‘మేజర్’ ప్రత్యేక ప్రివ్యూలు వివిధ నగరాల్లో ప్రదర్శించనున్నారు.

అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో శోభిత ధూలిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, రేవతి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. శశికిరణ్ తిక్క డైరక్ట్ చేసిన ఈ సినిమాకు మహేష్ బాబు నిర్మాత.

First Published:  23 May 2022 8:37 AM GMT
Next Story