Telugu Global
National

జ్ఞానవాపి కేసును జిల్లా కోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు

జ్ఞానవాపి మసీదు కేసులో జారీ చేసిన సర్వే ఉత్తర్వుపై జోక్యం చేసుకోబోమని శుక్రవారం నాడు తేల్చి చెప్పింది సుప్రీం కోర్టు. ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ వారణాసి పట్టణంలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదు సముదాయాన్ని వీడియోగ్రాఫిక్ సర్వే చేయాలని ఆదేశించిన వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మసీదును నిర్వహించే అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. […]

జ్ఞానవాపి కేసును జిల్లా కోర్టుకు
X

జ్ఞానవాపి మసీదు కేసులో జారీ చేసిన సర్వే ఉత్తర్వుపై జోక్యం చేసుకోబోమని శుక్రవారం నాడు తేల్చి చెప్పింది సుప్రీం కోర్టు. ఈ కేసును వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తరప్రదేశ్ వారణాసి పట్టణంలోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదు సముదాయాన్ని వీడియోగ్రాఫిక్ సర్వే చేయాలని ఆదేశించిన వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మసీదును నిర్వహించే అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. మసీదులో శివలింగం కనిపించిందన్న వార్తల నేపథ్యంలో మసీదు లోపల తమకు పూజలు చేసుకునే హక్కును కల్పించాలని హిందూ సంఘాలు కోరాయి.

మనం దేశం యొక్క సమతుల్యతను కాపాడే లక్ష్యంలో ఉన్నామని పేర్కొంటూ, శివలింగం ఉన్నట్లు నివేదించబడిన ప్రదేశాన్ని రక్షించడానికి మే 17 నాటి ఉత్తర్వు కొనసాగుతుందని కోర్టు తెలిపింది.
విచారణ సందర్భంగా, జస్టిస్ చంద్రచూడ్, “దయచేసి మనం దేశ సమతుల్యతను కాపాడే ఉమ్మడి మిషన్‌లో ఉన్నామని మర్చిపోవద్దు” అని అన్నారు.

జిల్లా కోర్టు విచారిస్తున్న ఈ కేసుపై తన సూచనగా సుప్రీం కోర్టు ఇలా చెప్పింది, “కొంచం ఎక్కువ అనుభవజ్ఞుడైన, పరిణతి చెందిన వ్యక్తి ఈ కేసును వినాలి. ఇది అన్ని పార్టీలకు ప్రయోజనం చేకూరుస్తుంది” అని పేర్కొంది.

మసీదు లోపల హిందువుల పూజల కోసం కేసు విచారణను జిల్లా జడ్జి ద్వారా నిర్వహించాలని సుప్రీం కోర్టు సూచించింది. అప్పటి వరకు తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం శివలింగం ప్రాంత రక్షణ, ముస్లింలకు నమాజ్ కోసం ఉచిత ప్రవేశం కొనసాగుతుందని కోర్టు చెప్పింది.

First Published:  20 May 2022 9:49 AM GMT
Next Story