Telugu Global
NEWS

కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఓదేలు

టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన సతీమణి మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో వారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరితోపాటు పలువురు టీఆర్ఎస్ నేతలు, మంచిర్యాల కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ లో చేరిన వారిలో ఉన్నారు. గత కొంతకాలంగా నల్లాల ఓదేలు టీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఆయనకు చెన్నూరు నుంచి టీఆర్ఎస్ […]

కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఓదేలు
X

టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన సతీమణి మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో వారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరితోపాటు పలువురు టీఆర్ఎస్ నేతలు, మంచిర్యాల కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ లో చేరిన వారిలో ఉన్నారు. గత కొంతకాలంగా నల్లాల ఓదేలు టీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

గత ఎన్నికల్లో ఆయనకు చెన్నూరు నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. ఓదేలును పక్కకు పెట్టి.. అప్పటి ఎంపీ, విద్యార్థి సంఘం నేత బాల్క సుమన్‌కు టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్ఠానం. దీంతో అప్పటినుంచి ఓదేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు బాల్క సుమన్ తో విబేధాలు కొనసాగుతున్నాయి.

గత జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఓదేలు సతీమణి భాగ్యలక్ష్మికి టీఆర్ఎస్ జడ్పీ చైర్ పర్సన్ పదవిని ఇచ్చింది. అయినప్పటికీ నియోజకర్గంలో ఓదేలు వర్గీయులు, బాల్క సుమన్ వర్గీయులు రెండు ముఠాలుగా విడిపోయారు. పలు సార్లు ఒకరిపై మరొకరు బహిరంగ ఆరోపణలు చేసుకున్నారు. చాలా రోజులుగా పార్టీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న ఓదేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం.

First Published:  19 May 2022 8:01 AM GMT
Next Story