Telugu Global
NEWS

బాబును చూసి జనం కేరింతలు.. కాకినాడ పోర్టు బీసీలకు ఇవ్వొచ్చుగా

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్‌ కృష్ణయ్యకు ఏపీ కోటాలో ఎలా రాజ్యసభ సీటు ఇస్తారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు.ఒక వ్యక్తికి రాజ్యసభ ఇస్తే మొత్తం బీసీలకు న్యాయం జరిగిపోతుందా అని ప్రశ్నించారు. కాకినాడ పోర్టును బీసీలకు ఇచ్చి దాన్ని మీరే నడుపుకోండి అని చెప్పవచ్చు కదా అన్నారు.. అదానీకి కట్టబెట్టిన ఆస్తులన్నీ బీసీలకు ఇవ్వొచ్చుగా అని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసమే ఆర్‌ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తున్నారని విమర్శించారు. మీ పార్టీలో పనిచేసిన […]

బాబును చూసి జనం కేరింతలు.. కాకినాడ పోర్టు బీసీలకు ఇవ్వొచ్చుగా
X

తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్‌ కృష్ణయ్యకు ఏపీ కోటాలో ఎలా రాజ్యసభ సీటు ఇస్తారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు.ఒక వ్యక్తికి రాజ్యసభ ఇస్తే మొత్తం బీసీలకు న్యాయం జరిగిపోతుందా అని ప్రశ్నించారు.

కాకినాడ పోర్టును బీసీలకు ఇచ్చి దాన్ని మీరే నడుపుకోండి అని చెప్పవచ్చు కదా అన్నారు.. అదానీకి కట్టబెట్టిన ఆస్తులన్నీ బీసీలకు ఇవ్వొచ్చుగా అని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసమే ఆర్‌ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తున్నారని విమర్శించారు. మీ పార్టీలో పనిచేసిన బీసీలు లేరా?, లేక సొంత పార్టీలోని బీసీలు గుర్తుకు రావడం లేదా అని నిలదీశారు.

మంత్రి పదవులు బీసీలకు ఇచ్చి, వారి చుట్టూ మొత్తం అధికారులంతా రెడ్డి సామాజికవర్గం వారే ఉండేలా చేస్తున్నారని, ఇక బీసీ మంత్రులకు నిర్ణయాలు తీసుకునే అధికారం ఎక్కడ ఉంటోందని ప్రశ్నించారు. అసలు మంత్రులకు ఎలాంటి పవర్‌ లేదని… సీఎంవోలో కేంద్రీకృతమైందని, అక్కడంతా రెడ్లే ఉన్నారని విమర్శించారు. టీడీపీ అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చామని, వైసీపీ అలా ఎందుకు ఇవ్వడం లేదన్నారు.

బీసీల్లో ఎక్కువ మంది కులవృత్తుల వారేనని… ఈ మూడేళ్లలో వారికి ఉపాధి లేకుండా చేశారన్నారు. త్వరలో విజయవాడ, తిరుపతి, విశాఖలో బీసీ లీడర్ల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని… జగన్‌ ఎలా బీసీలను మోసం చేస్తున్నారని వివరిస్తామన్నారు.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతలుగా, లోక్‌సభ స్పీకర్లుగా వెనుకబడిన వర్గాల నేతలను నియమించిన పార్టీ టీడీపీ అని చెప్పారు. టీడీపీ నిర్వహించిన బాదుడే బాదుడు ఏపీలో ఒక సంచలంగా మారిందన్నారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా ఒక సినిమా స్టార్‌ను చూసినట్టుగా కేరింతలు కొడుతున్నారని బుద్దా వ్యాఖ్యానించారు. కొత్తగా ఎవరూ చెప్పకపోయినా చంద్రబాబును చూడగానే సభలకు వచ్చే వారు సీఎం..సీఎం అంటూ అరుస్తున్నారని… ఈ విషయం కూడా జగన్‌కు తెలిసిపోయిందని అందుకే మంత్రులతో బస్సు యాత్ర మొదలుపెడుతున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు.

ALSO READ: ఏపీలో భారీ స్కాం- వైసీపీ ఎంపీ పిల్లి

First Published:  19 May 2022 1:06 AM GMT
Next Story