Telugu Global
Cinema & Entertainment

మరోసారి నిర్మాణంలోకి 'పూర్ణోదయ'

జాతీయ‌స్థాయిలో ప‌లు అవార్దులు పొంది, తెలుగులో గ‌ర్వించే సంస్థగా పేరు పొందిన‌ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా మారారు. శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో తొలి చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. శ్రీ‌జ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` అని పేరు ఖ‌రారు చేశారు. ఈ చిత్ర లోగోను ప్రముఖ ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించాడు. ఈ సినిమాకు జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ కథ అందించడంతో పాటు స్క్రీన్ […]

మరోసారి నిర్మాణంలోకి పూర్ణోదయ
X

జాతీయ‌స్థాయిలో ప‌లు అవార్దులు పొంది, తెలుగులో గ‌ర్వించే సంస్థగా పేరు పొందిన‌ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా మారారు. శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో తొలి చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు.

శ్రీ‌జ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో' అని పేరు ఖ‌రారు చేశారు. ఈ చిత్ర లోగోను ప్రముఖ ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించాడు. ఈ సినిమాకు జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ కథ అందించడంతో పాటు స్క్రీన్ ప్లేకి కూడా వర్క్ చేశాడు. అనుదీప్ దగ్గర వర్క్ చేసిన వంశీ, ల‌క్ష్మీనారాయ‌ణ ద‌ర్శకులుగా ప‌రిచ‌యం అవుతున్నారు.

శంకరాభరణం, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు లాంటి క్లాసిక్స్ తీసిన బ్యానర్ పూర్ణోదయ పిక్చర్స్. అలాంటి బ్యానర్ నుంచి మరో బ్యానర్ రావడం, నిర్మాతగా వారసురాలు పరిచయం అవ్వడం నిజంగా ఆనందించదగ్గ విషయం.

పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కించిన కామెడీ చిత్రం ఇది. రథన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  16 May 2022 10:45 AM GMT
Next Story