Telugu Global
NEWS

శ్రీ‌వారి ఉత్స‌వాల‌కు ప్ర‌ముఖుల‌కు ఆహ్వానం..

భువ‌నేశ్వ‌ర్‌లో నూత‌నంగా నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి దేవాల‌య ప్రారంభోత్స‌వానికి హాజ‌ర‌వ్వాల్సిందిగా టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర‌ప్ర‌ధాన్‌ను ఆహ్వానించారు. శుక్ర‌వారం ఉద‌యం కేంద్ర‌మంత్రి ప్ర‌ధాన్‌ను ఆయ‌న కార్యాల‌యంలో క‌లిసిన టీటీడీ చైర్మ‌న్‌.. శ్రీ‌వారి ఆల‌య మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మ ఆహ్వాన‌ప‌త్రిక‌ను అంద‌జేశారు. ఈనెల‌ 21వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని కేంద్ర మంత్రికి […]

శ్రీ‌వారి ఉత్స‌వాల‌కు ప్ర‌ముఖుల‌కు ఆహ్వానం..
X

భువ‌నేశ్వ‌ర్‌లో నూత‌నంగా నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి దేవాల‌య ప్రారంభోత్స‌వానికి హాజ‌ర‌వ్వాల్సిందిగా టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర‌ప్ర‌ధాన్‌ను ఆహ్వానించారు. శుక్ర‌వారం ఉద‌యం కేంద్ర‌మంత్రి ప్ర‌ధాన్‌ను ఆయ‌న కార్యాల‌యంలో క‌లిసిన టీటీడీ చైర్మ‌న్‌.. శ్రీ‌వారి ఆల‌య మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మ ఆహ్వాన‌ప‌త్రిక‌ను అంద‌జేశారు.

ఈనెల‌ 21వ తేదీ నుంచి ఆలయ మహాసంప్రోక్షణకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని కేంద్ర మంత్రికి టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వివ‌రించారు.

అదే విధంగా సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్‌.వీ.ర‌మ‌ణ‌, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి వారి వారి కార్యాల‌యాల్లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఢిల్లీలోని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌య వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు హాజ‌ర‌వ్వాల్సిందిగా సీజేఐ, కేంద్ర‌మంత్రిని కోరారు. బ్ర‌హ్మోత్స‌వాల‌కు సంబంధించిన ఆహ్వాన‌ప‌త్రిక‌ను వారికి అంద‌జేశారు.

First Published:  13 May 2022 2:36 AM GMT
Next Story