Telugu Global
Others

వైసీపీ జెడ్పీ చైర్‌పర్సన్ భర్తపై సీబీఐ కేసు

గుంటూరు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర క్రిస్టినా భర్త సురేష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. కత్తెర సురేష్‌ హార్వెస్ట్ ఇండియా సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. నిబంధనలకు విరుద్దంగా విదేశీ నిధులను పొందారన్న అభియోగాలపై సీబీఐ అతడిపై కేసు నమోదు చేసింది. అటు కత్తెర సురేష్‌పై బాలల హక్కుల జాతీయ కమిషన్‌ కూడా స్పందించింది. మైనర్ల అక్రమ దత్తతు, విదేశాలకు తరలింపు వ్యవహారంలో కత్తెర సురేష్‌పై బాలల కమిషన్‌ లో ఫిర్యాదు నమోదు అయింది. ఈ వ్యవహారంలో […]

వైసీపీ జెడ్పీ చైర్‌పర్సన్ భర్తపై సీబీఐ కేసు
X

గుంటూరు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర క్రిస్టినా భర్త సురేష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. కత్తెర సురేష్‌ హార్వెస్ట్ ఇండియా సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. నిబంధనలకు విరుద్దంగా విదేశీ నిధులను పొందారన్న అభియోగాలపై సీబీఐ అతడిపై కేసు నమోదు చేసింది.

అటు కత్తెర సురేష్‌పై బాలల హక్కుల జాతీయ కమిషన్‌ కూడా స్పందించింది. మైనర్ల అక్రమ దత్తతు, విదేశాలకు తరలింపు వ్యవహారంలో కత్తెర సురేష్‌పై బాలల కమిషన్‌ లో ఫిర్యాదు నమోదు అయింది. ఈ వ్యవహారంలో కత్తెర సురేష్‌పై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు జిల్లా ఎస్పీకి బాలల హక్కుల జాతీయ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

క్రిస్టినా దంపతుల వ్యవహారం చాలా సార్లు వివాదాస్పదమైంది. ఎస్సీ రిజర్వ్‌ అయిన గుంటూరు జెడ్పీ స్థానంలో కత్తెర క్రిస్టినా నియామకాన్నిపలువురు వ్యతిరేకించారు. అసలు క్రిస్టినా ఎస్సీనే కాదంటూ ఫిర్యాదులు చేశారు. కానీ, జగన్‌కు సన్నిహితులు కావడంతో వైసీపీ వాటిని లెక్క చేయలేదు. ఆమెను జెడ్పీ చైర్‌పర్సన్‌గా నియమించారు. క్రిస్టినా భర్త సురేష్‌ నిర్వహించే హార్వెస్ట్ ఇండియా సొసైటీ ఒక మతానికి అనుకూలంగా ప్రచారం చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ సంస్థకు వచ్చే విదేశీ నిధులపైనా ఫిర్యాదులు వెళ్లాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేసి సీబీఐ కత్తెర సురేష్‌పై కేసు నమోదు చేసింది.

First Published:  12 May 2022 12:38 AM GMT
Next Story