Telugu Global
CRIME

మహిళా నేతపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు లైంగిక దాడి..

అతడు ఒక జాతీయ పార్టీకి జిల్లా అధ్యక్షుడు. మున్సిపల్ ఎన్నికల కోసం ఒక మహిళా నాయకురాలితో కలిసి పనిచేయమని అధిష్టానం నిర్ణయిస్తే.. ఏకంగా ఆమెపై కన్నేసి లైంగికదాడి చేశాడు. బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితురాలి వివరాల మేరకు.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివకుమార్‌కు 2020 మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించింది. అతడికి సహాయంగా ఓ మహిళా నాయకురాలిని నియమించింది. ఆ సమయంలోనే […]

మహిళా నేతపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు లైంగిక దాడి..
X

అతడు ఒక జాతీయ పార్టీకి జిల్లా అధ్యక్షుడు. మున్సిపల్ ఎన్నికల కోసం ఒక మహిళా నాయకురాలితో కలిసి పనిచేయమని అధిష్టానం నిర్ణయిస్తే.. ఏకంగా ఆమెపై కన్నేసి లైంగికదాడి చేశాడు. బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితురాలి వివరాల మేరకు.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివకుమార్‌కు 2020 మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించింది. అతడికి సహాయంగా ఓ మహిళా నాయకురాలిని నియమించింది. ఆ సమయంలోనే నిందితుడికి, బాధితురాలికి పరిచయం ఏర్పడింది.

ఎన్నికల ప్రచారం చేయడానికి అతడితో తరచూ స‌ద‌రు మహిళ మాట్లాడేది. అయితే శివకుమార్ మాత్రం ఆమెకు దగ్గరయ్యేందకు ఇదే ఛాన్స్ అనుకొని వక్రబుద్ది చూపించాడు. తరచూ ఆమెతో పార్టీ, ఎన్నికల గురించి కాకుండా వేరే విషయాలు చెబుతూ మెసేజ్‌లు చేసేవాడు. ఒక రోజు ఐ ల‌వ్ యూ చెప్పి ఏకంగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే బాధితురాలు మాత్రం అతడి ప్రపోజల్‌ను తిరస్కరించింది. నీకు ఇప్పటికే పెళ్లైంది నన్నెలా చేసుకుంటావని నిలదీసింది. కాగా, తన భార్యకు తీవ్రమైన జబ్బు ఉందని మూడేళ్లకు మించి బతకదని ఆమెతో చెప్పాడు. ఒకవైపు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. శివకుమార్ బాధితురాలిపై ఒత్తిడి తేవడం ప్రారంభించాడు.

ఒక రోజు దుబ్బాక ప్రచారంలో ఉండగా.. రాత్రి పూట మ‌ద్యం మ‌త్తులో బాధితురాలి గదికి వచ్చి కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో దాడి చేశాడు. మద్యం మత్తులో ఆమెను కొడుతుండగా.. బాధితురాలు తనను విడిచిపెట్టమని వేడుకున్నది. దీంతో ఆమెను ఆ రోజుకు వదిలేశాడు. కిందటి ఏడాది జూన్ 24న ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్న మారియట్ (గతంలో వైశ్రాయ్) హోటల్‌కు తీసుకొని వెళ్లాడు. అక్కడ ఒక రూమ్ బుక్ చేసి శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు. అదే రోజు ఆమె మెడలో బలవంతంగా తాళి కట్టాడు. అయినా సరే బాధితురాలు లొంగలేదు.

కాగా, చివరికి ఒక రోజు బేగంపేటలోని గ్రాండ్ కాకతీయ హోటల్‌కు తీసుకొని వెళ్లి మత్తు గోలీలు కలిపిన కూల్ డ్రింక్‌ తాగించాడు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోగానే లైంగిక దాడి చేశాడు. అంతే కాకుండా ఆమె నగ్న చిత్రాలను తీశాడు. బాధితురాలు తేరుకున్న తర్వాత ఆమె చిత్రాలు చూపించి.. తన కోరిక తీర్చాలని, లేకుంటే ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అంతే కాకుండా ఈ విషయంపై ఆమె మాట్లాడితే చంపుతానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

నిందితుడిపై ఐపీసీ 417, 420, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట సీఐ నిరంజన్ రెడ్డి మీడియాకు చెప్పారు.

First Published:  9 May 2022 9:38 PM GMT
Next Story