Telugu Global
Andhra Pradesh

స్వరూపానందేంద్రతో టీటీడీ చైర్మన్ భేటీ

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఉమ్మ‌డి విశాఖ జిల్లా వైసీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్‌గా నియ‌మితులైన త‌రువాత.. తొలిసారి విశాఖ‌లో ప‌ర్య‌టించారు వైవీ సుబ్బారెడ్డి.

Swaroopanandendra Swamy
X

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఉమ్మ‌డి విశాఖ జిల్లా వైసీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్‌గా నియ‌మితులైన త‌రువాత.. తొలిసారి విశాఖ‌లో ప‌ర్య‌టించారు వైవీ సుబ్బారెడ్డి. ఉమ్మ‌డి విశాఖ‌ జిల్లాస్థాయి కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మావేశంలో పాల్గొని పార్టీ బ‌లోపేతానికి సంబంధించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

అనంత‌రం విశాఖ శ్రీ శార‌దాపీఠాన్ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా పీఠాధిప‌తుల ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో టీటీడీ చైర్మ‌న్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా చేపట్టదలచిన కార్యక్రమాలను పీఠాధిప‌తులు స్వ‌రూపానందేంద్ర‌, స్వాత్మానందేంద్ర స్వాములకు వివరించారు. కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గి భక్తుల రద్దీ పెరిగిన దృష్ట్యా టీటీడీ తీసుకోవాల్సిన చర్యలపై స్వరూపానందేంద్ర స్వామి టీటీడీ ఛైర్మన్‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఉమ్మ‌డి విశాఖ జిల్లాలో రేపు కూడా వైవీ సుబ్బారెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మ‌వుతారు. ఏపీలో గ‌త 35 నెల‌లుగా జ‌రుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాల‌న‌ను ప్ర‌జ‌ల్లో తీసుకెళ్లేందుకు పార్టీ రూపొందించిన గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైసీపీ కార్య‌క్ర‌మం గురించి పార్టీ నేత‌ల‌ను దిశానిర్దేశం చేయ‌నున్నారు.

First Published:  7 May 2022 11:04 AM GMT
Next Story