Telugu Global
Cinema & Entertainment

మహేష్ కోసం రూ.45 పెంపు

సర్కారువారి పాట సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వేటకు సిద్ధమౌతున్నాడు మహేష్ బాబు. పరశురామ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ట్రయిలర్ సూపర్ హిట్టయింది. పాటలు ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. త్వరలోనే మరికొన్ని పాటలు రాబోతున్నాయి. ఓవైపు ఇలా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే, మరోవైపు సినిమా రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సర్కారువారి పాట సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం నుంచి యూనిట్ కు […]

మహేష్ కోసం రూ.45 పెంపు
X

సర్కారువారి పాట సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వేటకు సిద్ధమౌతున్నాడు మహేష్ బాబు. పరశురామ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ట్రయిలర్ సూపర్ హిట్టయింది. పాటలు ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. త్వరలోనే మరికొన్ని పాటలు రాబోతున్నాయి. ఓవైపు ఇలా ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే, మరోవైపు సినిమా రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగా సర్కారువారి పాట సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం నుంచి యూనిట్ కు అనుమతి లభించింది. 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఆ రోజు నుంచి 10 రోజుల పాటు సర్కారువారి పాట సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి టికెట్ పై 45 రూపాయలు పెంచుకునేలా ఏపీ సర్కారు వెసులుబాటు కల్పించింది. మూవీ బడ్జెట్ ను అనుసరించి, ఈ పెంపు మొత్తాన్ని నిర్ణయించారు.

మార్చి 7న ఇచ్చిన జీవో నంబర్-13లో ఉన్న ధరల్ని అనుసరించి, టికెట్ రేట్లు పెంచుకోవాలని జీవోలో ప్రభుత్వం సూచించింది. పెంపు విషయంలో తేడాలు లేవు. బెంచ్ నుంచి బాల్కనీ వరకు అన్ని క్లాసులకు ఒకే పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

ఇటు తెలంగాణ సర్కారు నుంచి ఇంకా జీవో విడుదలకాలేదు. ఆ జీవో కూడా వచ్చిన వెంటనే ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడతారు. ఈ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయిన సంగతి తెలిసిందే.

First Published:  7 May 2022 3:13 AM GMT
Next Story