Telugu Global
NEWS

ధోనీ ఔట్ పై కోహ్లీ ఓవర్ రియాక్షన్.. ఫ్యాన్స్ ఫైర్..!

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మొదట్నుంచి ఆటలో భావోద్వేగాలు ఎక్కువే. వికెట్లు తీసినప్పుడు, విజయాలు సాధించినప్పుడు కాస్త అతిగానే స్పందిస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంటాడు. ప్రత్యర్థి జట్టు క్రికెటర్ల పట్ల దూకుడుగా ఉంటాడు. అవసరమైతే దూషణకు కూడా దిగుతాడు. అయితే ప్రత్యర్థి జట్ల పైన కోహ్లీ తీరు ఎలా ఉన్నా అతడికి క్రికెట్ అభిమానుల నుంచి మద్దతు లభించింది. అయితే తొలిసారి ధోని పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరు పట్ల క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. చివరికి కోహ్లీ […]

ధోనీ ఔట్ పై కోహ్లీ ఓవర్ రియాక్షన్.. ఫ్యాన్స్ ఫైర్..!
X

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మొదట్నుంచి ఆటలో భావోద్వేగాలు ఎక్కువే. వికెట్లు తీసినప్పుడు, విజయాలు సాధించినప్పుడు కాస్త అతిగానే స్పందిస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంటాడు. ప్రత్యర్థి జట్టు క్రికెటర్ల పట్ల దూకుడుగా ఉంటాడు. అవసరమైతే దూషణకు కూడా దిగుతాడు. అయితే ప్రత్యర్థి జట్ల పైన కోహ్లీ తీరు ఎలా ఉన్నా అతడికి క్రికెట్ అభిమానుల నుంచి మద్దతు లభించింది. అయితే తొలిసారి ధోని పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరు పట్ల క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. చివరికి కోహ్లీ ఫ్యాన్స్ సైతం కోహ్లీ చేసిన పనిని తప్పుపడుతున్నారు. గురువు లాంటి ధోని పట్ల వ్యవహరించేది ఇలాగేనా.. అని విమర్శలు చేస్తున్నారు.

ఇంతకు ఏం జరిగిందంటే.. నిన్న రాత్రి ఐపీఎల్ లో భాగంగా ఆర్సీబీ, సీఎస్కే మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ 30 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్ లో కోహ్లీ తప్పిదం కారణంగా మాక్స్ వెల్ ని ధోని మెరుపు వేగంతో రన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగులు చేసింది.

ఆ తర్వాత ఛేదనలో చెన్నై జట్టు ఆరంభంలో బాగానే ఆడింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(28), కాన్వే(56) అద్భుత ఆరంభం ఇచ్చారు. ఆ తర్వాత ఉతప్ప, మెయిన్ అలీ, జడేజా వికెట్లు వెంటవెంటనే కోల్పోవడంతో చెన్నై కష్టాల్లో చిక్కుకుంది. అయితే అప్పటికి ధోని కూడా ఇంకా ఆడాల్సి ఉండడంతో చెన్నై గెలుపు ఖాయం గానే కనిపించింది.

అయితే అనూహ్యంగా ధోని రెండు పరుగులకే హేజిల్ వుడ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ధోని అవుట్ అయిన వెంటనే కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. మామూలుగా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అవుట్ అయిన సమయంలో సంబరాలు చేసుకోవడం మామూలే అయినా కోహ్లి కాస్త అతిగా స్పందించాడు. ధోని క్రీజ్ వీడి వెళ్తున్న సమయంలో కోహ్లీ అభ్యంతరకర భాష మాట్లాడుతూ సెలబ్రేట్ చేసుకున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో కోహ్లీ బిహేవియర్ పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ధోనీ అవుట్ అయితే ఇంత అతిగా స్పందించాలా.. అభ్యంతరకరంగా ప్రవర్తించాలా.. అని మండిపడుతున్నారు. ఒకప్పుడు ఆయన నాయకత్వంలో ఎదిగావు..కెప్టెన్ అయ్యాక కూడా ధోని మార్గదర్శకంలో నడిచావు. అసలు నీ సమన్వయ లోపం కారణంగానే మాక్స్ వెల్ రనౌట్ అయ్యాడు. అది మనసులో పెట్టుకుని ధోని ఔట్ అవగానే అభ్యంతరకరంగా ప్రవర్తిస్తావా .. అని కామెంట్స్ చేస్తున్నారు.చివరికి కోహ్లీని ఆరాధించే అభిమానులు కూడా ధోని పట్ల కోహ్లీ వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు అని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ ఇప్పుడు అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు.

First Published:  5 May 2022 2:12 AM GMT
Next Story