Telugu Global
Cinema & Entertainment

మహేష్ నోట.. వైఎస్ జగన్ డైలాగ్..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైంది. బ్యాంకు, ఆర్థికలావాదేవీల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు గతంలోనే దర్శకుడు పరుశురామ్ ప్రకటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో హీరోయిన్ కీర్తీసురేశ్ కూడా అందంగా కనిపించింది. మరోవైపు సినిమాలో సున్నితమైన లవ్ ట్రాక్ కూడా పెట్టినట్టు సమాచారం. కాగా సర్కారు వారిపాట ట్రైలర్ చూసి అంతా షాక్ అయ్యారు. ఇందులో ‘నేను విన్నాను.. నేను […]

మహేష్ నోట.. వైఎస్ జగన్ డైలాగ్..!
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైంది. బ్యాంకు, ఆర్థికలావాదేవీల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు గతంలోనే దర్శకుడు పరుశురామ్ ప్రకటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో హీరోయిన్ కీర్తీసురేశ్ కూడా అందంగా కనిపించింది. మరోవైపు సినిమాలో సున్నితమైన లవ్ ట్రాక్ కూడా పెట్టినట్టు సమాచారం.

కాగా సర్కారు వారిపాట ట్రైలర్ చూసి అంతా షాక్ అయ్యారు. ఇందులో ‘నేను విన్నాను.. నేను ఉన్నాను‘ అంటూ హీరో మహేష్ ఓ డైలాగ్ చెప్పాడు. ఈ నినాదాన్ని గత ఎన్నికలకంటే ముందు జగన్ పాదయాత్రలో ప్రముఖంగా వాడుకున్నారు. ఎక్కడికెళ్లినా ఆయన ప్రజలకు ఇదే నినాదంతో భరోసా ఇచ్చారు. జనంలోకి ఈ నినాదం బాగానే వెళ్ళింది.

మరోవైపు గత ఎన్నికలకు ముందు మమ్ముట్టి హీరోగా నటించి విడుదలైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ సినిమాలోనూ ఈ డైలాగ్ ఉంది. కాగా తాజాగా సర్కారు వారి పాట చిత్రంలో ఈ డైలాగ్ ఉండటం చర్చనీయాంశం అయ్యింది. ఈ సినిమా రాజకీయనేపథ్యంలో కొనసాగబోతున్నాదా? అన్న చర్చ జరుగుతోంది. అయితే ఈ డైలాగ్ ను కేవలం కామెడీ కోసమే వాడి ఉంటారని ఊహాగానాలు వినబడుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమైన సర్కారు వారి పాట సినిమా ఈనెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

First Published:  2 May 2022 9:49 AM GMT
Next Story