Telugu Global
CRIME

పేప‌ర్‌ లీకేజీ సూత్రధారులు అరెస్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొద‌టిరోజు ప‌రీక్ష ప్రారంభానికి ముందే తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్‌లలో చ‌క్క‌ర్లు కొట్టింది. దీనికి సంబంధించి 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రశ్నాప‌త్రం లీకేజీ సూత్రధారి రాజేశ్‌తో సహా నాగరాజు, నిలకంఠేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, దుర్గ, పోతునూరు, ఆర్యభట్టు, రంగనాయకులు ఉన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టు అయిన‌ వారిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల […]

పేప‌ర్‌ లీకేజీ సూత్రధారులు అరెస్టు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొద‌టిరోజు ప‌రీక్ష ప్రారంభానికి ముందే తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్‌లలో చ‌క్క‌ర్లు కొట్టింది. దీనికి సంబంధించి 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రశ్నాప‌త్రం లీకేజీ సూత్రధారి రాజేశ్‌తో సహా నాగరాజు, నిలకంఠేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, దుర్గ, పోతునూరు, ఆర్యభట్టు, రంగనాయకులు ఉన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అరెస్టు అయిన‌ వారిని గురువారం కోర్టులో హాజరుపరిచారు.

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి హైస్కూల్‌ నుంచి ఈ ప్రశ్నపత్రం లీకైనట్టు గుర్తించారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ ప్రశ్నపత్రం లీకైనట్టు వార్తలు రాగానే జిల్లా విద్యాశాఖాధికారి, పోలీసు అధికారులు వేగంగా విచారణ చేపట్టారన్నారు. పరీక్ష ప్రారంభమైన వెంటనే తన మొబైల్‌లో ప్రశ్నపత్రాన్ని ఫొటోలు తీసి, ఆ ఫొటోలను బయటవేచివున్న తెలుగు టీచర్లకు పంపించాడని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహించిన చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్‌కు చెందిన నలుగురిని కూడా సస్పెండ్ చేసినట్టు క‌లెక్ట‌ర్‌ తెలిపారు.

First Published:  28 April 2022 6:05 AM GMT
Next Story