Telugu Global
Cinema & Entertainment

రిలీజ్ డేట్ మార్చిన ‘మేజర్’ మేకర్స్..!

26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఓ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇందులో అడవి శేషు హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రేక్షకులను ఎన్నో రోజులుగా ఊరిస్తోంది. ఇప్పటికే రిలీజ్ డేట్లు వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి. కరోనా కారణంగా విడుదల ఆగిపోయిన ఈ చిత్రం.. మే 22న విడుదల చేయబోతున్నట్టు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. జూన్ 3న సినిమాను […]

రిలీజ్ డేట్ మార్చిన ‘మేజర్’ మేకర్స్..!
X

26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఓ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇందులో అడవి శేషు హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్రేక్షకులను ఎన్నో రోజులుగా ఊరిస్తోంది. ఇప్పటికే రిలీజ్ డేట్లు వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి.

కరోనా కారణంగా విడుదల ఆగిపోయిన ఈ చిత్రం.. మే 22న విడుదల చేయబోతున్నట్టు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. జూన్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చెప్పారు.

ఈ సినిమా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. స్వయంగా అడవి శేషు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ప్రస్తుతం తెలుగు సినిమా హీరోలు పాన్ ఇండియా మూవీస్ మీద ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. అడవి శేషు కూడా మేజర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని చూస్తున్నాడు. అడవి శేషు గత చిత్రాలు సైతం ఘన విజయం సాధించాయి. దీంతో అతడికి ఓ వర్గం ప్రేక్షకులు దగ్గరయ్యారు. నటనలో వైవిధ్యం చూపించడంతో పాటు విభిన్న తరహా పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అడవి శేషు. మేజర్ మూవీ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

First Published:  27 April 2022 8:36 AM GMT
Next Story