Telugu Global
Cinema & Entertainment

ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్

సిల్వర్ స్క్రీన్ పై అంతగా క్రేజ్ తెచ్చుకోలేకపోతున్న నటులంతా, ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ఓటీటీ వైపు అడుగులేస్తున్నట్టున్నారు. ఈ విషయంలో హీరోయిన్లు అందరికంటే ముందు ఉండగా, హీరోలు ఇప్పుడిప్పుడే ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి రాజ్ తరుణ్ కూడా చేరిపోయాడు. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్, ఇప్పుడు ఓటీటీ స్పేస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. జీ5 కోసం ఓ […]

ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్
X

సిల్వర్ స్క్రీన్ పై అంతగా క్రేజ్ తెచ్చుకోలేకపోతున్న నటులంతా, ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ఓటీటీ వైపు అడుగులేస్తున్నట్టున్నారు. ఈ విషయంలో హీరోయిన్లు అందరికంటే ముందు ఉండగా, హీరోలు ఇప్పుడిప్పుడే ఆ దిశగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి రాజ్ తరుణ్ కూడా చేరిపోయాడు.

కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్, ఇప్పుడు ఓటీటీ స్పేస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. జీ5 కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. రాజమండ్రిలో ఈ వెబ్ సిరీస్ లాంచ్ అయింది, అక్కడే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. 8 ఎపిసోడ్స్ గా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ పేరు అహనా పెళ్లంట. ఒక్కో ఎపిసోడ్ నిడివి 30 నిమిషాలు ఉంటుంది.

ఇక కథ విషయానికొస్తే.. పెళ్లి రోజున తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పెళ్లి కూతురు లేచిపోతుంది. చేతిలో మంగళ సూత్రం పట్టుకుని ఆమె కోసం మండపంలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎన్నో ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న ఆ అబ్బాయి… తన జీవితంలో ముఖ్యమైన రోజున అలా జరుగుతుందని ఊహించని ఆ పెళ్లి కొడుకు, అందుకు కారణమైన అమ్మాయి – అబ్బాయి పై ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది ఈ వెబ్ సిరీస్ కథ.

ఇందులో రాజ్ తరుణ్ పాత్ర సరదాగా ఉంటుందని చెబుతున్నారు మేకర్స్. రాజశేఖర్ కుమార్తె శివానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. రాజ్ తరుణ్ తో పెళ్లి కుదిరిన తర్వాత, బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోయే పాత్రలో ఆమె కనిపించనుంది. ఇంతకుముందు అల్లు శిరీష్ తో ఏబీసీడీ అనే సినిమాను తీసిన సంజీవ్ రెడ్డి, ఈ వెబ్ సిరీస్ ను డైరక్ట్ చేస్తున్నాడు.

First Published:  4 April 2022 9:22 PM GMT
Next Story