Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు సెట్స్ పైకి అనుష్క

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో యూవీ క్రియేషన్స్ ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా ఈ నిర్మాణ సంస్థకు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేస్తోంది. అనుష్కకు ఇది కెరీర్ లో 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేసింది అనుష్క. […]

ఎట్టకేలకు సెట్స్ పైకి అనుష్క
X

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో యూవీ క్రియేషన్స్ ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా ఈ నిర్మాణ సంస్థకు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేస్తోంది.

అనుష్కకు ఇది కెరీర్ లో 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేసింది అనుష్క. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యూవీ బ్యానర్ పై చేసింది. ఇప్పుడిది హ్యాట్రిక్ మూవీ అవుతుందనే నమ్మకంతో ఉంది.

నవీన్ పొలిశెట్టి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. దర్శకుడు మహేష్ బాబు న్యూ ఇమేజ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 4 నుంచి మొదలు కానుంది. అనుష్క అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. నిశ్శబ్దం అనే సినిమా తర్వాత పూర్తిగా కనిపించకుండాపోయిన అనుష్క, ఇలా ఎట్టకేలకు సెట్స్ పైకి రావడం ఆమె ఫ్యాన్స్ కు శుభవార్తే మరి.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో షూట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమా రాబోతోంది.

First Published:  2 April 2022 6:54 AM GMT
Next Story