Telugu Global
Cinema & Entertainment

తాప్సి సినిమాకు 'జాతిరత్నం' వాయిస్ ఓవర్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ తన తదుపరి చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`ను నిర్మించింది. చాలా కాలం విరామం తర్వాత తెలుగులో తాప్సీ చేస్తున్న సినిమా ఇది. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం హై ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కొన్ని ఊహించని ట్విస్ట్ లు, కథనంలో వచ్చే మలుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కథనానికి మరింత ప్రత్యేకతను […]

తాప్సి సినిమాకు జాతిరత్నం వాయిస్ ఓవర్
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ తన తదుపరి చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్'ను నిర్మించింది. చాలా కాలం విరామం తర్వాత తెలుగులో తాప్సీ చేస్తున్న సినిమా ఇది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రం హై ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కొన్ని ఊహించని ట్విస్ట్ లు, కథనంలో వచ్చే మలుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కథనానికి మరింత ప్రత్యేకతను జోడించడానికి, నవీన్ పోలిశెట్టి ఈ చిత్రానికి తన వాయిస్ఓవర్ ఇచ్చాడు. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్ కు అద్భుతమైన స్పందన అందుకున్న ఈ చిత్రం మరింత హైప్ క్రియేట్ చేసింది.

నమ్మశక్యంగాని ఓ నిజమైన సంఘటన ఆధారంగా స్వరూప్ తన అద్భుతమైన రచన, టేకింగ్ తో కమర్షియల్ హంగులు జోడించి ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అన్ని కమర్షియల్ అంశాలు ఉంటూ యాక్షన్, థ్రిల్లింగ్ తో కూడిన పూర్తి ఎంటర్టైనర్ ఇది.

ఏప్రిల్ 1న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

First Published:  29 March 2022 9:20 AM GMT
Next Story