తిరుపతిలో మొదలైన అబ్బవరం సినిమా
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్ధేశీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రఖ్యాత దర్శకులు ప్రశాంత్ నీల్, కిషోర్ తిరుమల దగ్గర మురళి కిషోర్ గతంలో పనిచేశాడు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ […]
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్ధేశీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రఖ్యాత దర్శకులు ప్రశాంత్ నీల్, కిషోర్ తిరుమల దగ్గర మురళి కిషోర్ గతంలో పనిచేశాడు.
తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరుపతిలో మొదలైంది 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో 80 శాతం షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఇందులోనే పాటలు, ఫైట్ సీక్వెన్స్ లు కూడా ఉండబోతున్నాయి.
వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ కు అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారు. అదే టైమ్ లో మూవీ టీజర్, రిలీజ్ డేట్ లాంటి వివరాల్ని కూడా వెల్లడిస్తారు. తాజాగా రిలీజైన సెబాస్టియన్ ఫ్లాప్ అవ్వడంతో, ఈ కొత్త సినిమాపై మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టాడు అబ్బవరం.