Telugu Global
Cinema & Entertainment

కరోనా కరుణిస్తే వస్తానంటున్న గోపీచంద్

ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధార‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఈమధ్యే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా […]

కరోనా కరుణిస్తే వస్తానంటున్న గోపీచంద్
X

ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధార‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఈమధ్యే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వచ్చిన టైటిల్ సాంగ్ టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చింది.

ఇదే ఊపులో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మే 20న పక్కా కమర్షియల్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే రిలీజ్ డేట్ పోస్టర్ లో చిన్న పంచ్ కూడా జోడించారు. రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూనే.. కింద ‘కరోనా కరుణిస్తే’ అనే ట్యాగ్ లైన్ జోడించారు. అంటే కరోనా పరిస్థితులన్నీ చక్కబడితే, ఆ తేదీకి సినిమా రిలీజ్ అవుతుందనే అర్థం వచ్చేలా పోస్టర్ డిజైన్ చేశారు.

ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి మారుతి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఇది. ఇందులో ఆయనది చాలా కీలకమైన పాత్ర. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గోపీచంద్ కెరీర్ ను ఈ సినిమా మలుపుతిప్పుతుందంటున్నాడు దర్శకుడు.

First Published:  2 Feb 2022 11:07 AM GMT
Next Story