Telugu Global
Cinema & Entertainment

మరోసారి రెడీ అయిన శర్వానంద్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు శర్వానంద్. రిజల్ట్ తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. రీసెంట్ గా మహాసముద్రం సినిమాతో థియేటర్లలోకొచ్చిన ఈ హీరో, ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. దీంతో పాటు అతడు నటించిన ఒకే ఒక జీవితం సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు సంబంధించి ప్రచారం స్టార్ట్ చేశాడు శర్వానంద్. ఈ సినిమా షూటింగ్ […]

మరోసారి రెడీ అయిన శర్వానంద్
X

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు శర్వానంద్. రిజల్ట్ తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. రీసెంట్ గా మహాసముద్రం సినిమాతో థియేటర్లలోకొచ్చిన ఈ హీరో, ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. దీంతో పాటు అతడు నటించిన ఒకే ఒక జీవితం సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది.

తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు సంబంధించి ప్రచారం స్టార్ట్ చేశాడు శర్వానంద్. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది.

ఫిబ్రవరి 4వ తేదీ నుంచి నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు కాబోతోన్నాయి. ఫిబ్రవరి 4న టైటిల్ సాంగ్ (ఆడవాళ్లు మీకు జోహార్లు)ను రిలీజ్ చేయబోతోన్నారు. ఫిబ్రవరి 4 సాయంత్రం 4:05 గంటలకు ఈ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

టైటిల్‌ను బట్టి చూస్తే ఇది మహిళా ప్రాధాన్యమున్న చిత్రంగా కనిపిస్తోంది. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు.

First Published:  1 Feb 2022 10:51 AM GMT
Next Story